
365తెలుగుడాట్ కామ్ లైన్ న్యూస్,తిరుమల, ఫిబ్రవరి 8,2022: రథసప్తమి సందర్బంగా మంగళవారం సాయంత్రం 6నుంచి రాత్రి 7 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని కల్యాణ మండపంలో శ్రీనివాసుడు సర్వభూపాల వాహనంపై అనుగ్రహించారు. ఈ వాహన సేవలో కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి పాల్గొన్నారు.

సర్వభూపాల వాహనం – యశోప్రాప్తి
సర్వభూపాల అంటే అందరు రాజులు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనసేవ నుంచి గ్రహించవచ్చు.