death

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,నిజామాబాద్,ఆగష్టు14,2022: గొడవ పడి తన తండ్రిని, మామను హత్య చేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన నిజామాబాద్‌లో చోటుచేసుకుంది. పోలీసులు హంతకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని 28 ఏళ్ల కె. సతీష్‌గా గుర్తించారు.

పెళ్లికి ముందు ఉద్యోగం సంపాదించాలని కోరారు. ఇదే విషయమై సతీష్ తన తండ్రితో ఈ విషయంపై వాగ్వాదానికి దిగడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. అడ్డుకునేందుకు ప్రయత్నించిన అతని మామ నంది సాయిలుపై కూడా నిందితుడు దాడి చేశాడు.

death

సతీష్ తోబుట్టువుల్లో ఇద్దరు దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్నారు, అయితే నిందితుడు ఉద్యోగంలో చేసేందుకు ఆసక్తి చూపలేదు. కొంతకాలంగా, అతని తల్లిదండ్రులు ఉద్యోగం చేయమని అతనిని ఒప్పించేందుకు ప్రయత్నించారు. అది పెద్ద సమస్యగా మారింది. అయితే సతీష్ ఓ మహిళతో పరిచయం పెంచుకుని పెళ్లిపై ఆసక్తిగా ఉన్నాడని తల్లిదండ్రులకు తెలిపాడు.

death

“సంఘటనకు కొన్ని రోజుల ముందు సతీష్ తన తల్లిదండ్రులకు పెళ్లి ప్రతిపాదన గురించి చర్చించడానికి అమ్మాయి కుటుంబ సభ్యులు వస్తారని చెప్పాడు.” అని ముగ్పాల్ సబ్ ఇన్‌స్పెక్టర్ జి.మహేష్ మీడియాకు తెలిపారు. అయినా సతీష్‌ తల్లిదండ్రులు పట్టించుకోకపోవడంతో ఉద్యోగం చేయాలని కోరారు. ఈ నేపథ్యంలోనే గొడవ జరిగింది మాటామాటా పెరిగి తండ్రి అబ్బయ్య, మామ నంది సాయిలు ను హత్య చేశాడు సతీష్. ఘటన అనంతరం సతీష్ అక్కడి నుంచి పారిపోవడంతో పోలీసులు అరెస్టు చేశారు.