
365తెలుగుడాట్ కామ్ లైన్ న్యూస్,తిరుమల,ఫిబ్రవరి 8,2022: రథసప్తమి సందర్బంగా మంగళవారం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని కల్యాణ మండపంలో సప్తగిరీశుడైన శ్రీ వేంకటేశ్వరస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా కల్పవృక్ష వాహనంపై అభయమిచ్చారు.
కల్పవృక్ష వాహనం – ఐహిక ఫల ప్రాప్తి

కల్పవృక్ష వాహనంపై దర్శనమిస్తూ కల్పవృక్షం ఇవ్వలేని ధర్మమోక్షాల్ని కూడా నేను అనుగ్రహిస్తానని శ్రీవారు నిరూపిస్తున్నారు. కల్పవృక్షాలు లోకాతీతమైన ఏ ఫలాన్నయినా ఇస్తాయి. ఇవి కోరుకునేవారి తెలివిని బట్టి లభిస్తాయి. శ్రీదేవి, భూదేవి ఇహలోక ఫలాలిస్తారు. శ్రీవారు దివ్యలోకఫలాలు, ముక్తిని ప్రసాదిస్తారు. కనుక కల్పవృక్ష వాహనోత్సవ సేవ ఇహపరఫల ఆనందదాయకం.