365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, జూలై 7, 2025 : ఈసారి తన జన్మదినం సందర్భంగా మరోసారి మానవీయ కార్యక్రమానికి కేటీఆర్ శ్రీకారం చుట్టారు. సంవత్సర కాలంగా తన నియోజకవర్గంలో జన్మించిన 4910 మంది మాతృమూర్తులు, వారి శిశువులకు కేసీఆర్ కిట్లను పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ ప్రజల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలుచేశారని, అందులో తనకు అత్యంత ఇష్టమైన కార్యక్రమం కేసీఆర్ కిట్ అన్నారు కేటీఆర్. మాత శిశు మరణాలను భారీగా తగ్గించి, తల్లికి శిశువుకు మంచి ఆరోగ్యాన్ని అందించే కేసీఆర్ కిట్ను ప్రస్తుత సిఎం రేవంత్ రెడ్డి పట్టించు కోవడంలేదని విమర్శించారు. అందుకే సిరిసిల్ల జిల్లాలో గత 18 నెలలుగా పుట్టిన ప్రతి ఒక్క శిశువుకు కేసీఆర్ కిట్ ను అందిస్తానని కేటీఆర్ తెలిపారు.
తన పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఐదు సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలను చేపట్టామని కేటీఆర్ తెలిపారు. 2020 సంవత్సరంలో కరోనా ప్రపంచాన్ని కుదిపేస్తున్న సందర్భంలో తన అనుచరులు, కార్యకర్తలు గిఫ్ట్ ఏ స్మైల్ ద్వారా 108 అంబులెన్స్ వాహనాలను ప్రభుత్వ ఆసుపత్రులకు అందించారని గుర్తుచేశారు. ఆ తర్వాత 2021లో 14 మంది దివ్యాంగులకు సహాయం అందించారని చెప్పారు.
2022 సంవత్సరంలో సుమారు 600 సామ్ సంగ్ మొబైల్ టాబ్స్ను సిరిసిల్ల జిల్లాలోని విద్యార్థులకు అందించామని, వీటి ద్వారా విద్యార్థులు నీట్, JEE వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యారని, అనేకమంది ఉత్తమ ర్యాంకులు సాధించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడిందని కేటీఆర్ గుర్తుచేసుకున్నారు.
ఇది కూడా చదవండి…పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ లో పర్యావరణ పండుగ: వనమహోత్సవం ఘన విజయం..
Read This also…Bank of India Revises Green Deposit and Savings Deposit Rates..
Read This also…Smartworks Coworking Spaces IPO Opens July 10 with Price Band of ₹387–₹407 per Share..
Read This also…MS Dhoni Rings in His 44th Birthday with a Simple, Heartfelt Celebration..
Read This also…Aditya Birla Sun Life AMC Achieves First Close of ABSL Structured Opportunities Fund Series II with ₹700 Crore Commitment..
Read This also…Adani Enterprises Launches ₹1,000 Crore NCD Issue with Up to 9.30% Yield..

2023 సంవత్సరంలో ప్రతిభాపాటవాలు కలిగిన 116 మంది స్టేట్ హోం (యూసుఫ్గూడ) విద్యార్థులకు లాప్టాప్లు అందించి, అవసరమైన శిక్షణకు వారికి మద్దతు అందించినట్లు తెలిపారు. అదే సంవత్సరం సిరిసిల్లలో ఆత్మహత్య చేసుకున్న నేతన్నల కుటుంబాలకు సహకారం అందించినట్టు చెప్పారు.
ఒక చిన్న ఆలోచనగా ప్రారంభమైన గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం గత ఐదు సంవత్సరాలుగా వేలాదిమంది జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకువచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందన్న కేటీఆర్, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.