
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,నవంబరు 25,2021: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై జెఈవో శ్రీ వీరబ్రహ్మం గురువారం ఆలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ కల్యాణ మండపం వద్ద భక్తులకు, అర్చకులకు వసతి కల్పించేందుకు ఏర్పాట్లు చేపట్టాలన్నారు. శ్రీవారిమెట్టు వద్ద శ్రీకృష్ణదేవరాయ సదన్ను భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. వర్షపునీరు రోడ్డుపై నుండి ఆలయంలోకి రాకుండా చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆలయం గురించి తెలిసేలా సైన్బోర్డులు త్వరితగతిన ఏర్పాటు చేయాలన్నారు. వైకుంఠ ఏకాదశి రోజున భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తగిన ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. అభివృద్ధి పనులకు గాను పురావస్తు శాఖ అధికారులకు ప్రతిపాదనలు పంపాలని కోరారు. త్వరలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు.

అనంతరం ఆయన నరసింగాపురం వద్దనున్న ఆయుర్వేద ఫార్మశీని సందర్శించి, అక్కడ తయారవుతున్న ఆయుర్వేద మందుల గురించి అధికారులతో చర్చించారు. అదేవిధంగా నిర్మాణంలో ఉన్న భవనాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను జెఈవో ఆదేశించారు.