365తెలుగు.కామ్ ఆన్లైన్ న్యూస్,తిరుపతి, జూలై,23, 2022: తిరుమల తిరుపతి దేవస్థానానికి (టిటిడి)కి శుక్రవారం రూ.30 లక్షల విలువైన 25 ఎలక్ట్రిక్ స్కూటర్లను టీవీఎస్ మోటార్స్ సంస్థ విరాళంగా అందించింది. ఈ మేరకు టివిఎస్ సంస్థ ప్రతినిధులు శ్రీవారి ఆలయం ఎదుట ఈ ద్విచక్ర వాహనాలకు పూజా కార్యక్రమం నిర్వహించి వాటి తాళాలను టిటిడి ఈవో ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు.

తిరుమల పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడే విధంగా ఎలక్ట్రిక్ వాహనాలను అందించిన టివిఎస్ సంస్థకు ఈ సందర్భంగా ఈవో ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టివిఎస్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ సెల్వం, టివిఎస్ (ఫ్యూచర్ మొబిలిటి) వైస్ ప్రెసిడెంట్ మనోజ్ సక్సేనా, తిరుపతిలోని శ్రీనివాస టివిఎస్ డీలర్ పిఆర్.సిద్ధార్థ్, ప్రతినిధి రాజారెడ్డి, డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ జానకిరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.