Sat. Jul 6th, 2024
Two-students-killed-in-road

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మొయినాబాద్‌,ఆగష్టు 21,2022:ఇద్దరు విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన శనివారం రాత్రి మొయినాబాద్‌లో జరిగింది . అర్ధరాత్రి మొయినాబాద్ రోడ్డులోని ఏపీపీఏ జంక్షన్‌కు కొంచెం ముందుగా ఆర్టీసీ బస్సు స్విఫ్ట్ డిజైర్ కారును ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది.

ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారిద్దరూ గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న మొయినాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు.

కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రమాదం జరిగిన తర్వాత పెద్ద ఎత్తున జనం గుమిగూడి బస్సును ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారిని తరిమికొట్టారు.