365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జూలై 11,2024: తిరుమలలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. నిలువు నామాలతో ప్రజలకు పంగ నామాలు పెట్టారని, ఎర్రచందనం దోపిడీతో సర్కార్ కే అప్పులిచ్చే స్థాయికి ఎదిగారని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన గురువారం తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

శేషాచల కొండల్లో ఎర్రచందనం దోపిడీపై నివేదిక కోరతామని, నాస్తికులకు, అన్యమతస్థులకు పదవులిచ్చి తిరుమల పవిత్రతకు భంగం కలిగించారని, నివేదిక ఆధారంగా జాతీయ సంపదను దోచుకున్న వారిపై చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వెల్లడించారు.

ఏడుకొండలను రెండు కొండలుగా మార్చాలనుకున్న అన్యమత పాలన పోయిందని, అన్యమత పాలనపోయి గోవిందుడి పాలన వచ్చిందని, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.