365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఏప్రిల్ 9,2025: ఉత్తరాఖండ్ క్రీడా శాఖ, 38వ జాతీయ క్రీడల సందర్భంగా ఓ విశిష్టమైన పర్యావరణ పట్ల బాధ్యతను చాటింది. ప్రముఖ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బ్రాండ్ క్లియర్ ప్రీమియం వాటర్ తో కలిసి, డెహ్రాడూన్లోని మహారాణా ప్రతాప్ స్పోర్ట్స్ కాలేజ్ (ఎంఎ్పీఎస్సీ)లో రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ బాటిళ్లతో తయారు చేసిన పర్యావరణ అనుకూల బెంచ్లను ఏర్పాటు చేశారు.
Read this also…Karungali Mala 10 Amazing Benefits..
ఇది కూడా చదవండి…నేచురల్ స్టార్ నానితో ఆశీర్వాద్ మసాలాల ‘దమ్’ క్యాంపెయిన్
Read this also…ITC’s Aashirvaad Masalas and Nani Team Up to Spice Up Telugu Kitchens
జాతీయ క్రీడల ముగింపు అనంతరం, ఉత్తరాఖండ్ రాష్ట్ర క్రీడల మంత్రి రేఖా ఆర్య ఈ బెంచ్లను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ‘‘స్థిరత్వం పట్ల నిబద్ధతను చూపించే చర్య ఇది. వృత్తాకార ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటుగా, ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రజల వినియోగానికి అనుకూలంగా మలచడం ద్వారా పచ్చని భవిష్యత్తుకి దోహదపడుతుంది,’’ అని పేర్కొన్నారు.

క్లియర్ ప్రీమియం వాటర్ ఫౌండర్ & సీఈఓ నయన్ షా మాట్లాడుతూ, ‘‘పర్యావరణ హితానికి తోడ్పడేలా ఉపయోగించిన ప్లాస్టిక్ బాటిళ్లను సామూహిక ప్రయోజనాలుగా మలచడం మా లక్ష్యం. మిషన్ ‘జీరో ప్లాస్టిక్ బాటిల్ వేస్ట్’ సాధన సాధ్యమేనని ఈ ప్రాజెక్టు ద్వారా చూపిస్తున్నాం,’’ అని వివరించారు.