365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జూలై 31,2024: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఈరోజు వన మహోత్సవం – 2024 ఉత్సాహభరితంగా జరిగింది. రాజేంద్రనగర్ లోని విశ్వవిద్యాలయం ఆరోగ్య కేంద్రం ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది.

విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్, పరిశోధనా సంచాలకులు డాక్టర్ పి. రఘురామి రెడ్డి ఇతర విశ్వవిద్యాలయ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ, ప్రకృతి పరిరక్షణకి మొక్కలు విరివిగా నాటాలని ఆయన సూచించారు.

వాతావరణ మార్పుల ప్రభావాన్ని తట్టుకోవడానికి మొక్కల పెంపకాన్ని ఉద్యమస్ఫూర్తితో చేపట్టాల్సిన అవసరం ఉందని రఘురామిరెడ్డి అభిప్రాయపడ్డారు.

బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు ఉత్సాహంగా మొక్కలు నాటారు. ఈ వన మహోత్సవంలో వేప, రావి, ప్లుమేరియం వంటి సుమారు 150 మొక్కలు నాటారు.

Also read :The ‘Magical Mangroves Campaign’ empowers over 34,000 lives across seven coastal states in India

ఇదికూడా చదవండి:రియల్‌మీ13 ప్రో 5జి అండ్ రియల్‌మీ13 ప్రో+ 5జి స్మార్ట్‌ఫోన్ లాంచ్..

ఇదికూడా చదవండి:రిలయన్స్ జియో కస్టమర్లకు సూపర్ ప్లాన్..

ఇదికూడా చదవండి:రియల్‌మీ13 ప్రో 5జి అండ్ రియల్‌మీ13 ప్రో+ 5జి స్మార్ట్‌ఫోన్ లాంచ్..

ఇదికూడా చదవండి:అమెజాన్ ఫ్రీడమ్ సేల్ 2024 త్వరలో ఎలక్ట్రానిక్స్‌పై భారీ ఆఫర్స్.