365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, 11సెప్టెంబర్ 2020 మహిళల క్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా కేర్ హాస్పిటల్స్ –హైటెక్
సిటీ విభాగం ఉచితంగా సెకండ్ ఓపీనియన్ కన్సల్టేషన్ను క్యాన్సర్ రోగుల కోసం ప్రారంభించింది. రొమ్ము క్యాన్సర్,గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, గర్భాశయ లోపలి పొర క్యాన్సర్,థైరాయిడ్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ (పెద్దవారు, పిల్లలు)తో బాధ పడుతున్న రోగులకు 09 సెప్టెంబర్ 2020నుంచి 30 సెప్టెంబర్ 2020 వరకూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఉచితంగా కన్సల్టేషన్ అందించనున్నారు . రిజిస్ట్రేషన్లు,అపాయింట్మెంట్స్ కోసం 85230 74262 లేదా 97012 45678కు కాల్ చేయవచ్చు.క్యాన్సర్ డాట్ ఓఆర్జీ అంచనాల ప్రకారం ప్రతి 8 నిమిషాలకు ఓ మహిళ గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్తో మరణిస్తుంటే, నూతనంగా రొమ్ముక్యాన్సర్ గుర్తించిన ప్రతి ఇద్దరు మహిళల్లో ఒకరు భారతదేశంలో మరణిస్తున్నారు.

అంచనాల ప్రకారం భారతదేశంలో ప్రతి సంవత్సరం 1,22,000 మంది మహిళలు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారినపడుతుంటే వీరిలో 67వేల మంది రోగులు మరణిస్తున్నారని అంచనా.ఈ కార్యక్రమం గురించి డాక్టర్ తనూశ్రీ, ఫెసిలిటీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ మాట్లాడుతూ ‘‘ఆరోగ్యసంరక్షణ సదుపాయాల ప్రాప్యత సరిగా లేకపోవడం, సమగ్రమైన పరిశీలనా కార్యక్రమాలు లేకపోవడం వంటివి రోగ నిర్థారణపై ప్రభావం చూపుతున్నాయి. చాలామంది మహిళలు వ్యాధి ముదిరిన తరువాత మాత్రమే గుర్తించబడుతున్నారు. ఈ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు మేము కన్సల్టేషన్ను ప్రారంభించాం.తద్వారా వారు ద్వితీయాభిప్రాయాన్ని కేర్ హాస్పిటల్స్లోని అత్యాధునిక వైద్య ఉపకరణాల ద్వారా పొందడంతో పాటుగా తమ స్థితిని మరింత మెరుగ్గా అర్థ చేసుకోగలరు’’ అని అన్నారు.భారతీయ మహిళల్లో రొమ్ము, పెదవులు, నోరు, గర్భాశయం, జీర్ణకోశ క్యాన్సర్లు అతి సాధారణంగా కనిపిస్తుంటాయి. అన్ని క్యాన్సర్లలోనూ వీటి వాటా 47.2%గా ఉంది. కొన్ని సమాజాలలో ఋతుచక్రాన్ని సైతం నిషిద్దాంశంగా భావిస్తుండటంతో తరచుగా గైనకాలజికల్ క్యాన్సర్ లక్షణాలను గుర్తించలేకపోతున్నారు. అయితే సరైన
సమయంలో గుర్తించి, చికిత్సనందిస్తే ఈ క్యాన్సర్లలో చాలా వరకూ నివారించవచ్చు.
For Further Information: Dyutiman Basu – 9968594446 (dyutimanbasu@adfactorspr.com)