365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,డిసెంబర్ 6,2022: ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానాల్లో ఒకటైన ఎయిర్ బస్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది.

ఈ విమానం కంబోడియాలోని మట్కామ్ విమానాశ్రయం నుంచి హైదరాబాద్ చేరుకుంది. భారీ విమానాలు ల్యాండింగ్, పార్కింగ్, టేకాఫ్ కోసం శంషాబాద్ విమానాశ్రయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం ఆంటోనోవ్ ఏఎన్ 225, 2016లో శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వగా.
రెండో అతిపెద్ద కార్గో విమానం ఎయిర్బస్ బెలూగా ల్యాండ్ అయింది. హైదరాబాద్ నుంచి కార్గో లోడుతో కూడిన కార్గో విమానం థాయ్లాండ్లోని పట్టాయాకు వెళ్లింది.

Source from ETV