365తెలుగు డాట్ కామ్ ఆన్లైన్ న్యూస్, కడప, డిసెంబర్ 23, 2024: మాజీ ముఖ్య మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపటి నుంచి డిసెంబర్ 24 నాలుగు రోజుల పాటు పులివెందుల పర్యటనను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
డిసెంబర్ 24, 2024: ఉదయం 11 గంటలకు బెంగళూరు నుంచి ఇడుపులపాయకు చేరుకుని దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తారు. అనంతరం ప్రేయర్ హాల్లో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు.
అక్కడ నుంచి కడప నియోజకవర్గ నాయకులతో సమావేశమై మధ్యాహ్నం 3:30 గంటలకు పులివెందుల బయలుదేరి వెళతారు. రాత్రికి పులివెందులలోని తన నివాసంలో బస చేస్తారు.
డిసెంబర్ 25, 2024: ఉదయం 8:30 గంటలకు క్రిస్మస్ సందర్భంగా పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2:30 గంటలకు తాతిరెడ్డిపల్లిలో రామాలయాన్ని ప్రారంభించిన అనంతరం పులివెందుల చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.
డిసెంబర్ 26, 2024: పులివెందుల క్యాంప్ ఆఫీస్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను విన్ను పరిష్కరించడానికి తగిన చర్యలు చేపడతారు.
డిసెంబర్ 27, 2024: ఉదయం 9 గంటలకు పులివెందుల విజయా గార్డెన్స్లో జరగనున్న వివాహ వేడుకకు హాజరవుతారు. అనంతరం పులివెందుల నుంచి బయలుదేరి బెంగళూరు వెళతారు.
ఈ పర్యటనలో వైఎస్ జగన్కు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలుకనున్నారని సమాచారం.