365తెలుగుడాట్ కామ్ ఆన్లైన్ న్యూస్, విజయవాడ, డిసెంబర్1, 2022: విజయవాడ లో “జయహో బీసీ మహా సభ” ఏర్పాట్లు పరిశీలించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై ఆయన మరోసారి విరుచుకుపడ్డారు. విజయ సాయి రెడ్డి మాటల్లోనే…
- చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు. 2024 తర్వాత ఆ పార్టీ కూడా ఉండదు. చంద్రబాబు తన జీవితంలో మళ్ళీ సీఎం కాలేడు. లోకేష్, చంద్రబాబులకు వచ్చే ఎన్నికల తర్వాత రాజకీయ భవిష్యత్ ఉండదు.
- ఇప్పుడు చివరి అవకాశం ప్లీజ్ అంటున్నాడు.

ఆఖరి అవకాశం ఇస్తే.. నీవు చేయగలిగింది ఏమిటి చంద్రబాబూ.. అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. – చంద్రబాబుకు 2014-19 మధ్య అధికారం ఇస్తే.. నిర్లక్ష్య వైఖరితో, అసంబద్ధంగా పరిపాలన చేశాడు. దాంతో రాష్ట్రాభివృద్ధి కుంటుపడింది. మూడు సార్లు సీఎం చేసిన రాష్ట్ర ప్రజలను మోసం చేశాడు.
- గోబెల్స్, చంద్రబాబు అన్నదమ్ముల్లాంటి వాళ్ళు. చెప్పిన అబద్ధాన్నే పదే పదే చెబితే.. నిజమని ప్రజలు భావిస్తారని అనుకుని నిత్యం అబద్ధాలను ప్రచారం చేస్తారు.
- చంద్రబాబు పుట్టినరోజు కూడా ఏప్రిల్ 20 అంటే.. 420. చంద్రబాబు చేసేవన్నీ దొంగ పనులు.
- చంద్రబాబు అసలు నాయకుడే కాదు. కుల పిచ్చి ఉన్న వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబు కేవలం తన కులం, తన కుటుంబం, తన మనుషుల కోసమే పనిచేశాడు.
- జగన్ గారు ఒకవైపు సంక్షేమం.. మరోవైపు అభివృద్ధి.. ఇంకోవైపు సామాజిక న్యాయాన్ని పాటిస్తూ.. రాష్ట్రాన్ని అన్నివిధాలా ముందుకు తీసుకువెళుతుంటే.. సైకోల్లా చంద్రబాబు, లోకేష్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు.
- లోకేష్ ఒక్క మాట కూడా సరిగ్గా మాట్లాడలేడు. అతనికి రాజకీయంగా అవగాహన సున్నా.. ఏ విషయం మీద కనీస అవగాహన లేని వ్యక్తి లోకేష్. చెడ్డ అలవాట్లన్నీ ఉన్న వ్యక్తి లోకేష్..
- అటువంటి లోకేష్ పాదయాత్ర కాదు.. పొర్లు దండాలు పెట్టినా ప్రజలు నమ్మరు. లోకేష్ లాంటి అసమర్థుడ్ని ప్రజలు నాయకుడిగా అంగీకరించరు. అధికారం వస్తుందని చంద్రబాబు, లోకేష్ కలలు కంటున్నారు. వారి కలలు కల్లలే.

నూటికి నూరు శాతం వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది. గతంలో కంటే ఎక్కువ ఓట్లు, సీట్లతో అధికారంలోకి వస్తాం. మరో 25 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారే సీఎం గా ఉంటారు. పేదల కోసం సీఎం జగన్ గారు పనిచేస్తున్నారు.
- రాష్ట్రంలో శాంతిభద్రతలు చాలా పక్కాగా అమలవుతున్నాయి.
- చంద్రబాబును ఎవరు మాత్రం చంపాలనుకుంటారు..? ఎవరైనా చంపాలనుకుంటే.. అది వాళ్ళ అవివేకమే అవుతుంది.
- చంద్రబాబును ఎందుకు చంపుతారు. ఏమీ చేయలేని అసమర్థులు చంద్రబాబు, లోకేష్ లు.
- ఈ రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగున్నాయి. చంద్రబాబు భయపడాల్సిన అవసరం లేదు.
- తెలుగు డ్రామాల పార్టీకి అధినాయకుడు అయిన చంద్రబాబు.. తాను అభద్రతాభావంలో ఉన్నట్టు నాటకం ఆడుతున్నాడు. ఇదంతా సానుభూతి కోసం డ్రామా.
ఇవి కూడా చదవండి..
ఇండియాలో మూడు ఎయిర్ పోర్టుల్లో ఫేషియల్ రికగ్నిషన్ బేస్డ్ ఎంట్రీ..
చలికాలంలో నవజాత శిశువుల సంరక్షణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
వాహనదారులకు గుడ్ న్యూస్..భారీగా తగ్గనున్న పెట్రోల్,డీజిల్ ధరలు.. ఎందుకంటే..?
కెఎస్.జవహర్ రెడ్డి ప్రొఫైల్..
శాంసంగ్ గెలాక్సీ A14, M54 5G, S23 సిరీస్ లాంచ్కు ముందే ఫీచర్స్ లీక్
డిసెంబర్10న డా.జి.సమరంతో దాంపత్య వికాసంపై నేషనల్ లెవల్ ట్రైనింగ్ క్యాంప్
ఇండియాలో మొట్టమొదటి అంతర్జాతీయ బౌద్ధ విశ్వవిద్యాలయం.. ఎక్కడంటే..?
ఫ్రీగా హిందూ పురాణాలకు సంబంధించిన పీడీఎఫ్ బుక్స్..
సమీర్ శర్మ కు సీఎం జగన్ కీలక బాధ్యతలు
వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం..విచారణ తెలంగాణకు బదిలీ
పిల్లల్లో మధుమేహం ప్రమాదాన్ని తగ్గించడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి..?
అమ్మకానికి మినరల్ వాటర్ కంపెనీ బిస్లరీ..కారణం ఇదే..
డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిస్తే..మళ్లీ డ్రైవింగ్ టెస్టు తప్పనిసరి..