amit-shah

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,చండీగఢ్, జూలై 30,2022:: మాదకద్రవ్యాల అక్రమ రవాణా సమాజానికి ముప్పుగా పరిణమిస్తు న్నందున, మాదకద్రవ్యాల పట్ల కేంద్రం జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబించిందని, దాని ఫలితాలు కనిపిస్తున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం చండీగఢ్‌లో అన్నారు. చండీగఢ్‌లోని పంజాబ్ రాజ్ భవన్‌లో మాదకద్రవ్యాల రవాణా, జాతీయ భద్రతపై రెండు రోజుల నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) జాతీయ సదస్సును ప్రారంభించారు అమిత్ షా. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రారంభించనున్నారు.

amit-shah

హోం మంత్రి వర్చువల్ పర్యవేక్షణలో జూన్ 1 నుంచి డ్రగ్స్ నిర్మూలన ప్రచారాన్ని ప్రారంభించగా.. ఎన్‌సిబి స్వాధీనం చేసుకున్న30,000 కిలోల కంటే ఎక్కువ మాదకద్రవ్యాలను ధ్వంసం చేశారు. జూలై 29 వరకు 11 రాష్ట్రాల్లో 51,217 కిలోల మాదకద్రవ్యాలు పారవేశారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ జరుపుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు 75 ఏళ్ల స్వాతంత్య్రం సందర్భంగా 75,000 కిలోల డ్రగ్స్‌ను నాశనం చేస్తామని ఎన్‌సీబీ ప్రతిజ్ఞ చేసింది.

amit-shah

అమిత్ షా అనంతరం ప్రసిద్ధ వర్షాధార సుఖ్నా సరస్సులో “హర్ ఘర్ తిరంగ”, “ఆజాదీ కా అమృత్ మహోత్సవ్” లేజర్ షోకి హాజరయ్యారు. చండీగఢ్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, హర్యానా హోం మంత్రి అనిల్ విజ్, చండీగఢ్ ఎంపీ కిరణ్ ఖేర్, చండీగఢ్ సలహాదారు ధరమ్ పాల్ ఘనంగా స్వాగతం పలికారు.