Sun. May 19th, 2024

365తెలుగు డాట్ కామ్ ,ఆన్ లైన్ న్యూస్ ,జనవరి 2,హైదరాబాద్: మానవహక్కులు అనేది ఒక దేశానికో ఒక వర్గానికి ఒక జాతికో సంబందించిన సమస్య కాదు మానవ హక్కులు ఉల్లంఘన అనేది మనందరికీ సంబందించిన విషయం ప్రపంచంలో 1948 సం.లో మానవహక్కుల రక్షణ కోసం చట్టం చేయబడినది మన దేశంలో 1993 సంవత్సరం అమలులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2005 సంవత్సరం రాష్ట్ర మానవహక్కుల కమీషన్ ఏర్పడింది. ప్రాథమిక హక్కు ఉల్లంఘననే మానవ హక్కుల మానవహక్కుల ఉల్లంఘన అంటారు.

పోలీసు వ్యవస్థ మనకి బ్రిటిషు వారి నుంచి సంక్రమించింది. మానవ హక్కులను గౌరవించాలన్న భవన పోలీసులకు లేదు. బ్రిటిష్ వారు మన స్వేచ్ఛను అనణదొక్కడనికి మాత్రమే పోలీసు వ్యవస్థను ఉపయోగించేవారు. మన దేశంలో పోలీసు వ్యవస్థ ఇలాగే తయారు అయినది.

ఎలాంటి ముద్దాయులకు సంకెళ్లు వేయరాదు

ముద్దాలగా ఉండి చికిత్స పొందుతున్న వారికి సంకెళ్లు వేయరాదు. శిక్ష పడిన ఖైదీలకు, విచారణలో ఖైదీలకు, జైల్లో ఉన్నపుడు కోర్టుకి తీసుకెళ్లేన్నప్పుడు, ఒక జైలు నుంచి మరో జైలుకు తీసుకెళ్ళునప్పుడు, సంకెళ్లు( బంధనాలు) వేయడానికి వీలు లేదు అని సుప్రీంకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

పరిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడని ఆధారాలు ఉంటే అలాంటి వారిని మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచి వ్రాతపూర్వకముగా అనుమతి పొందాలి. హింసాత్మక ప్రవృత్తి కలిగిన కేసుల్లో ముద్దాయులకు సంకెళ్లు వేయమని మేజిస్ట్రేట్ ఆదేశాలు జరిచేయవచ్చు.

కోర్టుముందు హాజరు పర్చిన ముద్దాయిలకి వల్కనీ జ్యుడీషియల్ కస్టిడీకి పంపించిన లేక పోలీసు కస్టిడీకి ఇచ్చినా మేజిస్ట్రేట్ నుంచి ఆ విషయమై ప్రత్యేకమైన ఉత్తర్వులు ఉంటే తప్ప సంకెళ్లు ఎట్టి పరిస్థితుల్లో వేయరాదు.

వారెంట్ కేసుల్లో కూడా అరెస్టు చేయడానికి ప్రత్యేకఅనుమతులు తీసుకొని సంకెళ్లు వేయాలి

ఎవరైనా వ్యక్తిని పోలీసులు వారెంట్ లేకుండా అరెస్టు చేసినప్పుడు పై మార్గదర్శక సూత్రాల్ని ఆధారంగా చేసుకొని,అవసరమని భవించినప్పుడు మాత్రమే సంకెళ్లు వేయడానికి అవకాశం ఉంది. ప్రదేశం నుంచి పోలీసు స్టేషన్ వరకు అక్కడి నుంచి మెజిస్ట్రేట్ వద్దకు తీసుకొని వెళ్లేంతవరకు మాత్రమే సంకెళ్లు వెయ్యాలి మరల కూడా సంకెళ్లు వేయాలంటే మేజిస్ట్రేట్ అనుమతి పొందాలి. ఈ విషయం అన్ని హోదాలో ఉన్న పోలీసు వారికి వర్తిస్తుంది. ఒక వేళ సంకెళ్ళువేస్తే కోర్టుధిక్కరణ నేరమని సుప్రీంకోర్టు సిటీజన్స్ దేమోక్రసి V/s స్టేట్ ఆఫ్ అస్సాం జార్జిమెంట్ 1995సామ్ స్పష్టం చేసింది. కారణాలు లేకుండా మేజిస్ట్రేట్ అనుమతి పొందుకుండా సంకెళ్లు వేస్తే పోలీసులతో పాటు మేజిస్ట్రేట్ కూడా శిక్షార్హుడు అవుతారు. నష్టపరిహారం కూడా వేయవచ్చు.
బేడీలు(సంకెళ్లు) వేస్తే ఆర్టికల్స్ 14,19,21 విరుద్ధం.

అరెస్టు చేసినప్పుడు సంకెళ్లువేయవచ్చు అని ఏచట్టంలో పేర్కొనలేదు.
అరెస్టు అంటే ఏమిటో చట్టంలో ఎక్కడ నిర్వహించలేదు.
ఒక వ్యక్తిని శారీరకంగా నిర్బంధించడం అతన్ని కదికలను నిలుపుదల చేయడాన్ని అరెస్టు అంటారు. అయితే నేరం చేశాడని బలమైన ఆరోపణలు ఉండాలి .అని సుప్రీంకోర్టు 1953 స్పష్టం చేసింది.

అరెస్టు ఉద్దేశ్యం 2 రకాలు
1.అతనిపై ఉన్న క్రిమినల్ ఆరోపణలకు కోర్టుకు జవాబు చెప్పడానికి

  1. అతను ఏదైనా నేరం చేయకుండా నిరోధించడానికి.
    అరెస్టు శరీరాన్ని తాకడం ద్వారా నిర్బంధించడం ద్వారా చేయవచ్చు అయితే నిన్ను అరెస్టు చేస్తున్నామని మాటల ద్వారా చెపోయాల్సి ఉంటుంది.

సంకెళ్లు ఎప్పుడు వేస్తారో తెలుసుకుందాం

ఎవరినైనా అరెస్టు చేసినప్పుడు విచారణలో ఉన్న ముద్దాయిని కోర్టుకు తీసుకెళ్ళునప్పుడు సాధారణంగా సంకెళ్లు వేస్తారు. సంకెళ్లు సాధారణ పరిస్థితుల్లో వేయరాదు. అరెస్టు విషయంలో అత్యవసరమైనప్పుడు మాత్రమే వేయాలని సుప్రింకోర్టు జోగిందర్ కుమార్ కేసులో స్పష్టంగా చెప్పింది.

అరెస్టు చేసిన వ్యక్తిని ఆ వ్యక్తి కొరినప్పుడు అతని బంధువులనుగాని న్యాయవాదిని గాని అతని ప్రయోజనాలని చూసే ఏ వ్యక్తినైనగాని అతను సంప్రదించే అవకాశాన్ని పోలీసులు కల్పించాలి.

కస్టిడీ ఎవరిని చిత్రహించలు పెట్టారాదు ఒకవేళ చిత్రహింసలు గురిచేస్తే ఆర్టికల్ 21 ఉల్లంఘించినట్లే
కస్టిడి మరణం కన్న అతిహీమైన నేరం మరొక్కటిలేదు. అలాంటి పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకోమని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.