365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మే 14,2024: ఏఐఎస్ఎస్ఈ (2023-24) బోర్డ్ ఎగ్జామ్స్ ఫలితాల్లో నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించారు. ఇందుకు కారణమైన ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, సీనియర్ అకాడమిక్ కో-ఆర్డినేటర్, 10వ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులను స్కూల్ మేనేజ్మెంట్ హృదయపూర్వకంగా అభినందిస్తోంది.
![](https://365telugu.com/wp-content/uploads/2024/05/School-Chairman-Malka-Komaraiah.jpg)
డీపీఎస్, నాచారం 100% ఉత్తీర్ణత శాతాన్ని ప్రకటించడం చాలా గర్వంగా ఉందని యాజమాన్యం తెలిపింది.
ఈ ఫలితాల్లో అభినవ్ చిట్టూరి 98.7శాతం, యుగాంక్ మంత్రి 98.5శాతం, అల్లమనేని అనుశ్రుత్ 98.3శాతం, గడప నిపున్ 98.3శాతంతో పాఠశాల టాపర్లుగా నిలిచారు.
నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 12వ తరగతి విద్యార్థులు అద్భుతాలు సాధించారు. 2023-24 విద్యా సంవత్సరం 100శాతం ఉత్తీర్ణతతో పాటు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. ఇందుకు కృషి చేసిన ప్రిన్సిపాల్, సీనియర్ వైస్ ప్రిన్సిపాల్, 12వ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులను పాఠశాల యాజమాన్యం హృదయపూర్వకంగా అభినందిస్తోంది.
![](http://365telugu.com/wp-content/uploads/2024/05/School-Chairman-Malka-Komaraiah.jpg)
508 మంది విద్యార్థులతో తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద సీనియర్ సెకండరీ పాఠశాలగా డీపీఎస్ నాచారం నిలవడం తమకెంతో గర్వంగా ఉందని స్కూల్ యాజమాన్యం చెప్తోంది. మొత్తం విద్యార్థుల సంఖ్య – 508
స్కూల్ టాపర్స్ :
![](https://365telugu.com/wp-content/uploads/2024/05/DPS.jpg)
సైన్స్ టాపర్ – 98.2%తో హనా ఫర్యాల్
హ్యుమానిటీస్ టాపర్ – 97.4%తో ఆస్తా మహేశ్వరి
వాణిజ్యం టాపర్ – 97.2%తో గౌరవ్ సురానా
పాఠశాల ఫలితాల్లోని ముఖ్యాంశాలు :
– 102 మంది విద్యార్థులు 90%, అంతకంటే ఎక్కువ మార్కులు సాధించారు.
– 141 మంది విద్యార్థులు 80% – 89% మార్కులు సాధించారు.
– 165 మంది 70%- 79% మార్కులు సాధించారు.
– 100 మంది 60% – 69% మార్కులు సాధించారు.
– 23 మంది విద్యార్థులు 9 సబ్జెక్టులలో నూటికి నూరు మార్కులు సాధించారు.
స్కూల్ చైర్మన్ మల్కా కొమరయ్య, డైరెక్టర్ పల్లవి, సీఓఓ మల్కా యశస్వి, ప్రిన్సిపాల్ సునీతరావు, వైస్ ప్రిన్సిపాల్ అంకిత బోస్, సీనియర్ అకాడమిక్ కో-ఆర్డినేటర్ రాధా మాసాపేట, ఉపాధ్యాయుల దూరదృష్టి ఈ ఏడాది అత్యుత్తమ ఫలితాలతో ఫలించింది.
పాఠశాల ఫలితాల్లోని ముఖ్యాంశాలు :
![](https://365telugu.com/wp-content/uploads/2024/05/Director-Pallavi.jpg)
- 208 మంది విద్యార్థులు 90%, అంతకంటే ఎక్కువ మార్కులు సాధించారు.
- 244 మంది విద్యార్థులు 80-89% మార్కులు సాధించారు.
- 163 మంది విద్యార్థులు 70-79% మార్కులు సాధించారు.
- 97 మంది విద్యార్థులు 60%-69% మార్కులు సాధించారు.
- ఇంగ్లిష్, ఫ్రెంచ్, గణితం, సైన్స్, సోషల్ సైన్స్, తెలుగు, ఐటీ, హిందీలో మొత్తం 43 మంది విద్యార్థులు నూటికి నూరు మార్కులు సాధించారు.
- Aslo read :RJ Malishka, Rajesh Kumar, and KC Shankar step into the shoes of Sarojini Naidu, Liaquat Ali Khan, and VP Menon in Nikkhil Advani’s upcoming series ‘Freedom at Midnight’
- Aslo read : TATA AIG Launches First-of-its-Kind Satellite In-Orbit Third-Party Liability Insurance in India
- Aslo read : Aditya Birla Capital Limited Q4 FY24 financial results..
- Aslo read : TCS To Set UpFirst-of-its-Kind Human-Centric AI Center of Excellencein France
- Aslo read : TIVOLT Electric Vehicles (Murugappa Group venture) set to launch
- Aslo read : SBI becomes the first Bank as Trading cum Clearing Member of IIBX
- కూడా చదవండి: అగ్రిగేటర్ చెల్లింపు లైసెన్స్ను RBIకి సరెండర్ చేసిన Zomato పేమెంట్స్..