

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుపతి,సెప్టెంబర్ 7,2021:ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు మంగళవారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి.ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ,సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.



మొదటి రోజు ఉదయం పవిత్ర ప్రతిష్ట నిర్వహించారు. ఈ సందర్భంగా బాలబోగం, చతుష్టానార్చన, పవిత్ర హోమం, మధ్యాహ్న ఆరాధన, బరిహరణ, శాత్తుమొర చేపట్టారు. సాయంత్రం పవిత్రహోమం, నివేదన, శాత్తుమొర జరుగనున్నాయి.