sricure

365తెలుగు డాట్ కామ్ , ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, ఏప్రిల్ 19,2022: డయాబెటిక్ వ్యాధి గ్రస్తుల కోసం ఆధునిక సాంకేతికతను ఉపయోగించి తయారు చేసిన శ్రీ క్యూర్ ఔషధాన్ని శ్రీ వర్ ఫార్మా కంపెనీ మార్కెట్లో కి విడుదల చేసింది. హైదరాబాద్ లోని మారియట్ హోటల్ జరిగిన కార్యక్రమంలో ఆ సంస్థ చైర్మన్ ఎస్.ప్రభావతి, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఛైర్మెన్ ఎస్.ప్రభావతి మాట్లాడుతూ…డయాబెటిక్, సొరియాసిస్, బొలుసు తదితరుల వ్యాధుల సత్వర నివారణకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రకృతి పరంగా లభించే ఆయిల్స్, విటమిన్ల సమ్మేళనం తో ఈ ఔషధాన్ని తయారు చేసినట్టు వివరించారు. అమెరికా మార్కెట్లో సక్సెస్ అయిన ఈ డ్రగ్ పేటెంట్ హక్కులను ఇండియా లో తమ సంస్థ పొందిందని తెలిపారు.

sricure

మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.రామకృష్ణ మాట్లాడుతూ…ప్రతి సామాన్యుడికి శ్రీ క్యూర్ ప్రొడక్ట్ అందే విధంగా చర్యలు తీసుకుంటున్నాము. క్లీనిక్ లొనే కాకుండా తమ ఉత్పత్తులను డోర్ డెలివరీ చెయ్యనున్నాం. ఇప్పటికే తమ సంస్థ ద్వారా బోన్స్ స్ట్రేంత్ మల్టీ విటమిన్, ప్రెస్ రిలీఫ్ ఆవశదాలను మార్కెట్ లో ప్రవేశ పెట్టాము. ముఖ్యంగా డయాబెటిక్ వ్యాధిగ్రస్తులకు శ్రీ క్యూర్ ప్రొడక్ట్ ఎంతగానో ఉపయోగ పడుతుంది. ఈ ఏడాది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 300 ,ఇండియా వ్యాప్తంగా రాబోయే ఐదేళ్లలో 10 వేలకుపైగా థెరపటిక్ క్లినిక్ లను ప్రారంభించనున్నట్లు తెలిపారు.