365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,హైదరాబాద్, మే 23,2025: జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 41లో రోడ్డుతో పాటు.. నాలాను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను హైడ్రా శుక్రవారం ఉదయం తొలగించింది. 30 అడుగుల రహదారిలో ఆక్రమణలు తొలగించి 2 ఎకరాల పార్కుకు దారి చూపింది. దాదాపు రూ. 200ల కోట్ల రూపాయల ఆస్తిని కాపాడి.. ప్రజావినియోగంలోకి హైడ్రా తెచ్చింది.
జూబ్లీహిల్స్ సొసైటీ ప్రతినిధులు, అక్కడి నివాస ప్రాంతాలకు చెందిన వారు ఇచ్చిన ఫిర్యాదుపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్షేత్ర స్థాయిలో ఇది వరకే పరిశీలించారు. నాలాతో పాటు.. రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్టు నిర్ధారణ కావడంతో వాటి తొలగింపునకు హైడ్రా నోటీసులు గతంలోనే ఇచ్చింది. కోర్టునుంచి అనుమతులు లభించడంతో బుధవారం అక్రమ నిర్మాణాలను హైడ్రా తొలగించింది.
ఇది కూడా చదవండి…2 ఎకరాల శ్మశానవాటిక కాపాడిన హైడ్రా – ఫిర్జాదిగూడలో వేడుకల సందడి..
ఇది కూడా చదవండి…జర్మన్ సంస్థ సెలెక్ట్ ఎనర్జీతో జునో జౌల్ భాగస్వామ్యం – గ్రీన్ హైడ్రోజన్ ఎగుమతులకు భారత లక్ష్యానికి బలమైన మద్దతు..
కిరాయికి వచ్చి కబ్జాలు చేసిన వైనం..
జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 41లో అవసరాల శ్రీనివాస్ రుక్మాందగ రావుకు 1000 గజాల స్థలం ఉంది. ఇందులో 200ల గజాల వరకూ ఇల్లు కట్టారు. ఈ ఇల్లు జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడికి చేరువలో ఉంది. క్రోతుపల్లి శ్రీనివాస్కు దీనిని అద్దెకు ఇచ్చారు. ఈ ఇంటికి పక్కనే 30 అడుగుల మేర రోడ్డు ఉంది.

ఈ రోడ్డు మార్గంలో వెళ్తే 2 ఎకరాల పార్కుకు చేరుకోగలం. కాని ఆ దారినే మూసేశాడు కిరాయిదారుడు. దీంతో ఆ పార్కుకు దారి లేకుండా పోయింది. 30 అడుగుల మేర ఉన్న రహదారిలోనే బాక్సు టైపు నాలా ఉంది. నాలాతో పాటు.. రోడ్డును సగం వరకూ ఆక్రమించేశారు. ఇంటి ఖాళీ స్థలంతో పాటు.. పక్కనే ఉన్న రోడ్డును కూడా ఆక్రమించి హాస్టల్ నిర్మించాడు.
ఇంటి వెనుక ఉన్న ఖాళీ స్థలంలో కారు మరమ్మతుల షెడ్డును ఏర్పాటు చేసి అద్దెలకు ఇచ్చాడు. మొత్తం 907 గజాల మేర ఆక్రమణలకు పాల్పడ్డాడు. వాటిని అద్దెకు ఇచ్చి నెలకు రూ. 10 లక్షల వరకూ వసూలు చేస్తున్నాడు. ఇవన్నీ ఇంటి ఓనర్కు సంబంధం లేకుండా జరిగిపోయాయి.
ఇది కూడా చదవండి…ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్లో కొత్త అధ్యాయం : హార్మొనీ డైరెక్ట్ 2.0ను విడుదల చేసిన ఎక్సికామ్
Read This also…Exicom Unveils Harmony Direct 2.0: A Game-Changer in EV Charging with India’s First Indigenous Charger OS
కిరాయిదారుడిని తప్పు పట్టిన కోర్టు..
ఫిర్యాదు అందడంతో హైడ్రా రంగంలోకి దిగింది. ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసులపై కిరాయిదారుడు హైకోర్టును ఆశ్రయించారు (WP.no.10831 of 2025). రోడ్డును, నాలాను ఆక్రమించి ఎలా నిర్మాణాలు చేపడతారంటూ కిరాయిదారుడును కోర్టు ప్రశ్నించింది.

అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టిన కిరాయిదారుడు చేస్తున్న వాదనలను హైకోర్టు తప్పు పట్టింది. ఈ విషయంలో ఏమైనా అభ్యంతరాలున్నాయా అని ఇంటి ఓనర్ను కోర్టు అడిగింది.
తనకెలాంటి అభ్యంతరాలు లేవని చెప్పడంతో ఆక్రమణల తొలగింపునకు హైకోర్టు అనుమతులు మంజూరు చేసింది. దీంతో బుధవారం రంగంలోకి దిగిన హైడ్రా అక్కడ నిర్మించిన హాస్టల్ భవనాన్ని, కారు మెకానిక్ షెడ్డును తొలగించింది.
పార్కుకు దారి చూపిన హైడ్రా..
జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 41… ఎటు చూసినా వ్యాపార సముదాయాలు .. ట్రాఫిక్ రద్దీతో ఎక్కడ నిల్చోడానికి కూడా స్థలం లేని ప్రాంతం. అలాంటి చోట 2 ఎకరాల మేర పార్కు ఉంటే ఎంత ప్రయోజనమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
రోడ్డును ఆక్రమించి కిరాయిదారుడు నిర్మించిన కట్టడాలను హైడ్రా తొలగించడంతో ఇప్పడు పార్కుకు దారి దొరికింది. ఇప్పుడా 2 ఎకరాల పార్కును జీహెచ్ ఎంసీ అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.
ఆ పార్కు అందుబాటులోకి వస్తే అక్కడ ఎంతో మందికి ప్రాణవాయువు అందుతుంది. పార్కుకు దారి లభించడంతో స్థానికులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.