365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, జూన్ 7, 2025: వైద్య రంగంలో నిరంతరం వినూత్న ఆవిష్కరణలతో ముందుకు సాగుతున్న డాక్టర్ పల్లం ప్రవీణ్ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ఆయన స్వయంగా అభివృద్ధి చేసిన ‘పెయిన్లెస్ హైబ్రిడ్ లేజర్ శాండ్విచ్ ప్రొసీజర్’ విధానానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఈ అత్యాధునిక చికిత్స, పైల్స్ (హేమోరాయిడ్స్) సమస్యతో బాధపడుతున్న వారికి నొప్పి లేని, శాశ్వత పరిష్కారాన్ని అందించి అద్భుత ఫలితాలు సాధించింది.
ప్రస్తుతం “ఉస్మానియా హాస్పిటల్లో జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ (హెచ్ఓడీ)” గా సేవలందిస్తున్న డాక్టర్ పల్లం ప్రవీణ్, గత నాలుగు సంవత్సరాలుగా 500 మందికి పైగా రోగులపై ఈ వినూత్న విధానాన్ని విజయవంతంగా అమలు చేశారు. ఈ చికిత్స ద్వారా పైల్స్ సమస్య తిరిగి రాకుండా అద్భుతమైన ఫలితాలు కనిపించాయి.

Read This also…TransUnion CIBIL and Sa-Dhan Collaborate to Launch Nationwide Credit Awareness Program..
Read This also…NSE Sustainability Ratings and Analytics Ltd Launches ESG Ratings for Listed Companies..
డాక్టర్ ప్రవీణ్ తన విజయవంతమైన ప్రయోగానికి సంబంధించిన పరిశోధనాత్మక వ్యాసాన్ని ప్రపంచ ప్రఖ్యాత “ఇంటర్నేషనల్ సర్జరీ జర్నల్”కు సమర్పించారు. పలువురు ప్రముఖ సర్జన్ల నిశిత సమీక్షల అనంతరం, ఈ వ్యాసం ప్రచురణకు ఆమోదం పొందింది. ఇది డాక్టర్ ప్రవీణ్ పరిశోధన నాణ్యతకు, ఆయన ఆవిష్కరణ ప్రాముఖ్యతకు నిదర్శనం.
ఈ సందర్భంగా డాక్టర్ ప్రవీణ్ మాట్లాడుతూ, “రోగులకు కేవలం తాత్కాలిక ఉపశమనం కాకుండా, వారికి శాశ్వత పరిష్కారాన్ని అందించాలన్నదే నా ప్రధాన లక్ష్యం. నేను కనిపెట్టిన ఈ పద్ధతికి అంతర్జాతీయ గుర్తింపు రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది” అని సంతోషం వ్యక్తం చేశారు.
డాక్టర్ ప్రవీణ్ ఆవిష్కరించిన ఈ విధానం, హేమోరాయిడ్స్ చికిత్సలో నొప్పిని గణనీయంగా తగ్గించడమే కాకుండా, దీర్ఘకాలికంగా ఉపశమనాన్ని అందిస్తుందని స్పష్టమైంది. గత 100 సంవత్సరాలలో, సాధారణ శస్త్రచికిత్సలో ఒకరిద్దరు వైద్యులు మాత్రమే ఇలాంటి ఆవిష్కరణలు చేయగా, పైల్స్ చికిత్సకు సరికొత్త లేజర్ విధానాన్ని కనిపెట్టిన మొదటి భారతీయ వైద్యుడిగా డాక్టర్ పల్లం ప్రవీణ్ నిలిచారు. ఇది భారతీయ వైద్య రంగానికి, ముఖ్యంగా సర్జికల్ స్పెషాలిటీకి గర్వకారణం.