Tue. May 21st, 2024
A-strong-counter-should-be-

36తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అమరావతి,సెప్టెంబర్ 7,2022: ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను చెడుగా చిత్రీకరిస్తూ అసత్య ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాలకు ఇక నుంచి ప్రతి మంత్రి గట్టి కౌంటర్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.

ఏపీ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి జగన్ మంత్రులకు సూచించారు.టీడీపీ తప్పుడు ఆరోపణలను తిప్పికొట్టాలని, అబద్ధాలను గట్టిగా తిప్పికొట్టాలని మంత్రులను ముఖ్యమంత్రి కోరారు. ప్రతి అంశంపై మంత్రులందరూ స్పందించాలని, టీడీపీతో పాటు ఒక వర్గం మీడియా ప్రతిరోజూ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తోందని, కుటుంబ సభ్యులపై అనవసర విమర్శలు చేస్తోందని ఆరోపించారు.

A-strong-counter-should-be-

ఇకపై వారి ఆరోపణలను ఉపేక్షించబోమని సమావేశానికి హాజరైన మంత్రులకు సీఎం జగన్ సూచించారు. కాగా, ఈరోజు (బుధవారం) సచివాలయంలోని మొదటి బ్లాక్‌లోని కేబినెట్ సమావేశ మందిరంలో ఏపీ కేబినెట్ సమావేశం జరగగా 57 అంశాలకు ఆమోదం లభించింది.