Sat. Jul 27th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,హైదరాబాద్, జనవరి12,2024: అక్షర వాగ్దేవి ఇంటర్నేషనల్ స్కూల్ 10వ సాంస్కృతిక వార్షిక దినోత్సవ మహోత్సవం- వేదిక్ విస్టాను 11 జనవరి 2024న హైదరాబాద్ లోని నాంపల్లి, పబ్లిక్ గార్డెన్స్ లలిత కళాతోరణంలో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్ర జి. కిషన్ రెడ్డి ప్రారంభించారు.

స్కూల్ మండలి సభ్యులు ముఖ్యఅతిథులకు ఘనంగా సన్మానం చేయడంతో కార్యక్రమం ప్రారంభమైంది.అనంతరం మిడిల్‌బ్లాక్ విద్యార్థులు జ్యోతి ప్రజ్వలన చేసి స్వాగత నృత్యం చేశారు.

స్కూల్ ప్రిన్సిపాల్ జి. వనజవార్షిక నివేదికతో ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. తర్వాత ఆమె అక్షర వాగ్దేవి ఇంటర్నేషనల్ స్కూల్ ప్రయాణం,2023-24లోరాష్ట్ర, జాతీయ స్థాయిలో విద్యార్థులు సాధించిన అవార్డులు, విజయాల గురించి తెలిపారు.

హెడ్ గర్ల్ రసజ్ఞ కో-స్కాలస్టిక్ వివరాలను పంచుకున్నారు. అలాగే హెడ్ బాయ్ భరద్వాజ్ 2023-24 స్కాలస్టిక్ విజయాలను చెప్పారు.ముఖ్య అతిథిగాకేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రిశ్రీ జి. కిషన్ రెడ్డి హాజరయ్యారు.

అలాలే గౌరవ అతిథులుగా తెలంగాణ ప్రభుత్వ సంస్కృతి,భాషా సంచాలకులు డాక్టర్ మామిడి హరి కృష్ణ, భారత ప్రభుత్వ ఆదాయపు పన్ను శాఖ ఐఆర్ఎస్ ఆఫీసర్ బాల కృష్ణ ఈ వేడుకకు విచ్చేశారు.

పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఛైర్మన్శ్రీ మల్కా కొమరయ్య ఈ వార్షికోత్సవానికి హాజరై వివిధ కేటగిరీల హౌస్ కెప్టెన్‌లకు రోలింగ్ ట్రోఫీలు అందించారు. అలాగే అకాడమిక్, స్పోర్ట్స్ రెండింటిలోనూ రాష్ట్ర, జాతీయ స్థాయి ఛాంపియన్‌లకు ట్రోఫీలు ప్రదానం చేశారు.

అక్షర వాగ్దేవి, ఆర్జీఆర్ సిద్ధాంతి గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ఫౌండర్ అండ్ వైస్ చైర్మన్ పీఎల్ శ్రీనివాస్, డైరెక్టర్ సుశీల్ కుమార్, డైరెక్టర్ నిఖిల్, ట్రెజరర్ మురళి జనంపల్లి, శ్రీ హరి దంపతులు హాజరయ్యారు.

నేషనల్ స్కేటింగ్ లో సాథ్విక్ (గ్రేడ్ 4B), వంశిక (గ్రేడ్ 5A) అవార్డులు అందుకున్నారు. అలాగే రాష్ట్ర బ్యాడ్మింటన్ క్రీడాకారులు శేఖర్, రోషన్ (గ్రేడ్ 9B), తమన్నా(గ్రేడ్ 8A) ,ఫలక్ (గ్రేడ్ 9A) విజేతలుగా నిలిచారు.

విద్యార్థులందరూ 100% భాగస్వామ్యంతో భారతీయ సంస్కృతిని ప్రదర్శించే నృత్యం,నాటకంతో సహా వివిధ ప్రదర్శనలతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశారు.

అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ టి.సుధతో పాటు శిక్షణ డైరెక్టర్ పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ డాక్టర్ రాధా సింగ్‌తో సహా ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని పాఠశాల కార్యక్రమాలకు మద్దతునిస్తూ, ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించినందుకు పాఠశాలను అభినందించారు.

ముఖ్యఅతిథి జి. కిషన్‌రెడ్డి ప్రసంగిస్తూ.. భారతీయ సంస్కృతి ప్రాముఖ్యతను, దానిని రాబోయే తరాలకు అందించాల్సిన బాధ్యత ఎలా ఉంటుందో వివరించారు.

శ్రీ హరికృష్ణ మామిడి విద్యార్థులను భారతీయ సంస్కృతి విలువల గురించి,వారి అభిరుచిని ముందుకు తీసుకెళ్లేలా ప్రోత్సహించారు. బాల కృష్ణ (IRS)తన అనుభవాలను పంచుకున్నారు.

ఈ అద్భుతమైన ఈవెంట్ కోసం అక్షర వాగ్దేవి స్కూల్ బృందాన్ని అభినందించారు. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ను సీసీఏ కెప్టెన్ యువశ్రీ తెలిపారు.

మంచి చరిత్ర సందేశంతో ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిబ్బంది చేసిన కృషిని తల్లిదండ్రులు, ప్రేక్షకులు, అతిథులు అభినందించారు.ప్రిన్సిపాల్ వనజ ,వైస్ ప్రిన్సిపాల్ రచనా సింగ్ అందరి ప్రయత్నాలను ప్రశంసించారు.