365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,నల్లగొండ, ఫిబ్రవరి 22,2024: పట్టణంలో జరిగిన ఆర్యజనని కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. దాదాపు 300లకు పైగా గర్భిణీలు హాజరయ్యారు.
![](http://365telugu.com/wp-content/uploads/2024/02/Dasarath-Garu.jpg)
మాతృత్వానికి అసలైన అర్థం చెప్పే కార్యక్రమం ఆర్యజనని అంటూ వక్తలు కొనియాడారు. వైద్యపరమైన సలహాలు, సూచనలతో పాటు గర్భిణిలకు ఆధ్యాత్మిక అంశాలను, సంస్కృతీ, సంప్రదాయాలను, పురాణేతిహాసాలను ఆర్యజనని టీమ్ సభ్యులు చక్కగా వివరించారు.
![](http://365telugu.com/wp-content/uploads/2024/02/Aaryajanani.jpg)
ఈ కార్యక్రమంలో రామకృష్ణ పరమహంస భక్తులు దశరథ్, ఆర్యజనని బృందానికి చెందిన నిహారిక, వృశాలి, మాధవి పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం గర్భిణిలకు పోషకాలతో కూడిన ఆహారాన్ని పంపిణీ చేశారు.
![](http://365telugu.com/wp-content/uploads/2024/02/Ramakrishna-Seva-Samithi.jpg)
డాక్టర్ విఠల్ భోజన ఏర్పాట్లు చేయగా, కార్యక్రమ నిర్వహణను రామకృష్ణ పరమహంస భక్తులు దశరథ్ చూసుకున్నారు.
![](http://365telugu.com/wp-content/uploads/2024/02/Ramakrishna-Math-2.jpg)