365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఎర్రుపాలెం,ఏప్రిల్ 4,2023: చిరు ధాన్యాలతో చిన్నారులకు పోషణ కృత్రిమంగా అందుతుందని మధిర ఐసిడిఎస్ ఏసిడిపిఓ శారద శాంతి అన్నారు. సోమవారం ఎర్రుపాలెం రైతు వేదికలో పోషణ పక్షోత్సవాలు ముగింపు కార్యక్రమంలో చిరు ధాన్యాల ప్రయోజనాలపై ప్రజా ప్రతినిధులు, అధికారులు చిన్నారుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఎంపీపీ దేవరకొండ శిరీష మాట్లాడుతూ అంగన్వాడీలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ప్రభుత్వం ద్వారా పౌష్టికాహారాన్ని అందుకొని మెరుగైన ఆరోగ్యాన్ని పొందాలని తెలిపారు. జడ్పిటిసి శీలం కవిత మాట్లాడుతూ.. టీచర్లు విద్యార్థిని, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎనలేని కృషి చేస్తున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, ఏపీఎం వెంకటేశ్వర్లు, సర్పంచ్ మొగిలి అప్పారావు, ఎంపీటీసీ మస్తాన్ వలి, ఏసీడీపీఓ కృష్ణ శ్రీ, సూపర్వైజర్ రమణ, అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.