Fri. May 17th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,మార్చి5, 2022: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వైద్యుడిగా మారారు.నేషనల్ బిసి వెల్ఫేర్ అసోసియేషన్ తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ పసుపులేటి శశాంక్ తండ్రి పసుపులేటి బాబురావు గుండెపోటుతో హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వగా ఆయన్ను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మానసిక వైద్యుడిలా మారి మనోధైర్యం ఇచ్చారు. బండి సంజయ్ పరామర్శించడం పట్ల బాబురావు సంతోషం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా బాబు రావు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. త్వరగా కోలుకొని బిజెపి యాత్రలో పాల్గొనాలని కోరుకొంటున్నట్లు ఎంపీ బండి సంజయ్ కోరారు. అంతేకాకుండా వారి కుటుంబ సభ్యులకు మనో స్థైర్యాన్ని నింపారు.