Sat. Jul 27th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల 11 డిసెంబరు 2021: కురిసిన భారీ వర్షాల కారణంగా తిరుమల అప్ ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడి ధ్వంసమైన ప్రాంతాలను టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి శనివారం పరిశీలించారు.

మరమత్తు పనులు చేస్తున్న ఆఫ్కాన్ సంస్థ కు చెందిన కార్మికులతో మాట్లాడారు. బండరాళ్లను ఎలా తొలగిస్తున్నారు. రాళ్ళు కిందకు పడకుండా వాల్ కాంక్రీటు ఎలా చేస్తున్నారు. ఎంత మంది పనిచేస్తున్నారు అనే వివరాలు తెలుసుకున్నారు