Fri. Sep 20th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, విజయవాడ,సెప్టెంబర్ 20,2024: అక్టోబర్ 3 నుంచి 12 వరకు ఇంద్రకీలాద్రిపై నిర్వహించనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ జి. సృజన అధికారులను ఆదేశించారు. సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించడంతో పాటు, ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా సమన్వయం చేయాలని వారు తెలిపారు.

ఉత్సవాల ఏర్పాట్లపై కలెక్టర్, సీపీ రాజశేఖర్‌బాబు, ఎమ్మెల్యే సుజనాచౌదరి సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. మూలా నక్షత్రం రోజున అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు.

ఉత్సవాల తేదీలు:
అక్టోబర్ 3: బాలా త్రిపురసుందరిదేవి
అక్టోబర్ 4: గాయత్రీ దేవి
అక్టోబర్ 5: అన్నపూర్ణ దేవి
అక్టోబర్ 6: లలిత త్రిపురసుందరి దేవి
అక్టోబర్ 7: మహాచండీ దేవి
అక్టోబర్ 8: శ్రీమహలక్ష్మీ దేవి
అక్టోబర్ 9: సరస్వతి దేవి (మూలా నక్షత్రం)
అక్టోబర్ 10: దుర్గాదేవి
అక్టోబర్ 11: మహిషాసుర మర్దిని
అక్టోబర్ 12: శ్రీ రాజరాజేశ్వరిదేవి
ఈ ఉత్సవాల్లో వివిధ అలంకారాలతో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

error: Content is protected !!