Fri. Jul 5th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జూలై 3,2024:మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)కి ఎన్విరో ఇన్‌ఫ్రా ఇంజినీర్స్ లిమిటెడ్ తమ ముసాయిదా రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పీ)ని 2024 జూన్ 26న సమర్పించింది.

ఈ ఆఫర్ కింద తాజాగా 4,42,32,000 షేర్లను జారీ చేయనుండగా ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో 52,68,000 విక్రయించడం ద్వారా నిధులను సమీకరించాలని సంస్థ భావిస్తోంది. ఈ షేర్ల ముఖ విలువ రూ. 10గా ఉంటుంది.

ప్రభుత్వ సంస్థలకు వాటర్ అండ్ వేస్ట్‌వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్స్ (డబ్ల్యూడబ్ల్యూటీపీ), వాటర్ సప్లై స్కీమ్ ప్రాజెక్టులకు (డబ్ల్యూఎస్ఎస్‌పీ) సంబంధించి డిజైనింగ్, నిర్మాణం, నిర్వహణ కార్యకలాపాలను కంపెనీ నిర్వహిస్తోంది.

సమీకరించిన నిధులను కంపెనీ ఈ కింది విధంగా వినియోగించుకోనుంది.  (i) వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు (ii) ఉత్తర్ ప్రదేశ్‌లోని మథురలో ‘మథుర సీవరేజ్ స్కీము’ ప్రాజెక్టు కింద హైబ్రీడ్ యాన్యుటీ ఆధారిత పీపీపీ విధానంలో 15 ఏళ్ల పాటు ఆపరేషన్, మెయింటెనెన్స్ సహా 60 ఎంఎల్‌డీ ఎస్‌టీపీని నిర్మించేందుకు ఉద్దేశించిన అనుబంధ సంస్థ ఈఐఈఎల్ మథురా ఇన్‌ఫ్రా ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు నిధులు సమకూర్చడం (iii) నిర్దిష్ట రుణాలను పూర్తిగా లేక పాక్షికంగా చెల్లించేయడం లేదా ముందస్తుగా చెల్లించడం (iv) భవిష్యత్ ప్రాజెక్టులు, సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించుకోవడం.

ఈ పబ్లిక్ ఇష్యూకి హెమ్ సెక్యూరిటీస్ ఏకైక బుక్ రన్నింగ్ లీడ్ మేనేజరుగా ఉంటుంది.

ఇదికూడా చదవండి:జీవితంలో రిస్క్ తీసుకోవాలి – మహేష్ భగవత్

ఇదికూడా చదవండి: రామకృష్ణ మఠం సందర్శించిన కార్గిల్ యోధుడు కెప్టెన్ నవీన్ నాగప్ప.

Also read :ENVIRO INFRA ENGINEERS LIMITED FILES DRHP WITH SEBI

Also read :Ambani Family Wedding Celebrations Start with a Mass Wedding (Samuhik Vivah) for Underprivileged Couples

Also read : Avantra, one of India’s largest saree and ethnic wear brands, launches its 7th store in Hyderabad.

ఇదికూడా చదవండి: ప్రపంచ బిర్యానీ దినోత్సవం 2024: భత్కల బిర్యానీ రుచితో ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది..ఎలా?

Also read :Changes in Airtel, Jio 5G plans from today..

ఇదికూడా చదవండి: నేటి నుంచి Airtel, Jio 5G ప్లాన్‌లలో మార్పులు..