
365 తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్,న్యూస్,తిరుపతి, సెప్టెంబర్ 11,2021:రిషికేశ్ లోని తిరుమల తిరుపతి దేవస్థానాల ఆస్తులను ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి శనివారం పరిశీలించారు.తొలుత ఆంధ్రా ఆశ్రమంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వార్ల దర్శనం చేసుకున్నారు. అనంతరం అక్కడి భవనాలను పరిశీలించి, అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించారు. బిగ్ గార్డెన్, చుంగి గార్డెన్ లోని టీటీడీ ఆసులను పరిశీలించి, వాటి పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఈవో అధికారులకు పలు సూచనలు చేశారు. ఎస్టేట్ విభాగం ప్రత్యేక అధికారి శ్రీ మల్లిఖార్జున, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నరసింహమూర్తి తో పాటు స్థానిక అధికారులు ఉన్నారు.

అనంతరం ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి రుషికేష్ లో చాతుర్మాస్య దీక్షలో ఉన్న విశాఖ శారద పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానంద స్వామి వారిని కలిశారు.