365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, ఏప్రిల్ 7,2025: భారతదేశంలో B2B ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలో పురోగామిగా కొనసాగుతున్న BattRE ఎలక్ట్రిక్ వెహికల్స్, ప్రముఖ EV అగ్రిగేటర్ EV91 టెక్నాలజీస్, ఎలక్ట్రిక్ వాహనాల ఫైనాన్సింగ్ సంస్థ evpeతో కలిసి వ్యూహాత్మక భాగస్వామ్యంలోకి ప్రవేశించాయి. ఈ మూడు సంస్థల కలయికతో మొత్తం 10,000 ఎలక్ట్రిక్ వాహనాలను భారత మార్కెట్లోకి విడుదల చేయనున్నారు.
పట్టణం, గ్రామీణ ప్రాంత రవాణా వ్యవస్థలను నూతనంగా నిర్వచించేందుకు ఈ భాగస్వామ్యం దోహదపడనుందని సంస్థలు తెలిపాయి. ఈ ఒప్పందం ఏర్పడటంలో స్టార్టప్ ఎనేబ్లర్ BizDateUp కీలక పాత్ర పోషించింది.
Read this also…Air Pollution Identified as a Major Cause Behind Rising Heart Diseases
ఇది కూడా చదవండి…చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి జిల్లా కలెక్టర్ వరకు – హెచ్ఎస్ కీర్తన స్ఫూర్తిదాయక ప్రయాణం
ఈ సందర్భంగా BattRE వ్యవస్థాపకుడు, ఎండీ నిశ్చల్ చౌదరి మాట్లాడుతూ, “ప్రామాణిక నాణ్యతతో కూడిన అత్యాధునిక సాంకేతికత కలిగిన స్కూటర్లను వినియోగదారులకు అందించడమే మా లక్ష్యం. ఈ భాగస్వామ్యం పరస్పరాభివృద్ధికి దోహదపడుతుంది” అని పేర్కొన్నారు.

EV91 వ్యవస్థాపకుడు, సీఈఓ అరుణ్ కుమార్ మాట్లాడుతూ, “2023 ఆగస్టులో మా కార్యకలాపాలు ప్రారంభించాము. మహిళలకు అవకాశాలు కల్పిస్తూ, మేం బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై, పూణే సహా టైర్-1, టైర్-2 నగరాల్లో విస్తరిస్తున్నాం. మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలను రోడ్డుపైకి తీసుకురావడం ద్వారా హరిత భవిష్యత్తు వైపు ముందడుగు వేస్తున్నాం” అని అన్నారు.
evpe సీఈఓ, సహ వ్యవస్థాపకుడు రోహన్ యెగ్గినా మాట్లాడుతూ, “ఈ భాగస్వామ్యం ద్వారా అధిక సంఖ్యలో వినియోగదారులకు సరసమైన రీతిలో ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. BattREతో కలిసి పనిచేయడం ద్వారా ఫైనాన్షియల్ మోడల్స్ను మరింత సమర్థవంతంగా రూపొందించగలిగాం” అని తెలిపారు.
ఇది కూడా చదవండి…వక్ఫ్ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం అమలులోకి కొత్త చట్టం..
ఇది కూడా చదవండి…Rs.42,999 ప్రారంభ ధరతో Samsung Galaxy Tab S10 FE సిరీస్ భారత్లో లాంచ్..
BizDateUp వ్యవస్థాపకుడు జీత్ చందన్ మాట్లాడుతూ, “ఈ రంగంలో కీలక సంస్థల భాగస్వామ్యానికి వేదిక కావడం గర్వంగా ఉంది. భారత్లో EV వినియోగాన్ని వేగవంతం చేయడమే మా లక్ష్యం” అని పేర్కొన్నారు.