Tue. May 21st, 2024
Godawari_eblu

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, విజయవాడ,ఫిబ్రవరి18,2023: గోదావరి ఎలక్ట్రిక్ మోటార్స్, ఎబ్లూ శ్రేణి ఉత్పత్తుల తయారీదారు, ఇది ఆంధ్రప్రదేశ్లో తన మొదటి షోరూమ్ ను ప్రారంభించింది. బీఎస్ఈ స్కూటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ విజయవాడకు వచ్చింది.

ప్రపంచ-స్థాయి సాంకేతికతతో, షోరూమ్ వినియోగదారులకు విభిన్నమైన ఎలక్ట్రిక్ వెహికల్ అనుభవాన్ని అందిస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాల గురించి అవగాహనను పెంచేందుకు శ్రీకారం చుట్టింది.

ఈ షోరూమ్ 1200 చదరపు అడుగుల విస్తీర్ణంలో సర్వీస్ సెంటర్ సౌకర్యాన్ని కలిగి ఉంది. దీనిని విజయవాడలోని ఆటోనగర్ (పంటకాలువ రోడ్)లో ఏర్పాటుచేశారు.

షోరూమ్ మెరుగైన ఈవీ పరిజ్ఞానంతో అనుభవజ్ఞులైన సిబ్బందితో పాటు మెరుగైన కస్టమర్ అనుభవాన్ని అందిస్తుంది. షోరూమ్ బ్రాండ్ కస్టమర్ల ఎండ్-టు-ఎండ్ EV అవసరాలకు ఒకే దగ్గర సేవలందించనుంది.

ఈ సందర్భంగా గోదావరి ఎలక్ట్రిక్ మోటార్స్ సీఈవో హైదర్ ఖాన్ మాట్లాడుతూ, “భారతదేశంలోని దక్షిణ ప్రాంతం ఆటోమోటివ్ పరిశ్రమకు ఒక ముఖ్యమైన కేంద్రంగా ఉండటంలో కీలక పాత్ర పోషిస్తుంది.

Godawari_eblu

ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలులో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది. విజయవాడలో మా ఉనికితో, మార్కెట్ EV సంభావ్యతను పొందడం కంపెనీకి ముఖ్యమైనది. రాబోయే కాలంలో రాష్ట్రంలో మా ఉనికిని క్రమంగా విస్తరింపజేస్తామని ఆయన తెలిపారు.

బీఎస్ఈ స్కూటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ యజమాని సాంబశివ రావు మాట్లాడుతూ.. “ఆంధ్రప్రదేశ్ మార్కెట్లోకి గోదావరి ఎలక్ట్రిక్ మోటార్స్ ప్రవేశించడం మార్కెట్లో ఈవీ డిమాండ్ను తీర్చడానికి సరైన దిశలో ఒక ముందడుగు అని మేము నమ్ముతున్నాము.

బ్రాండ్ దాని ఉత్పత్తులకు మంచి స్పందన వస్తోంది. సుస్థిరమైన మొబిలిటీ యుగంలో గోదావరి మోటార్స్ తో ప్రయాణీంచడం మాకు సంతోషంగా ఉంది.” అనిఅన్నారు.

Godawari_eblu

షోరూమ్ ఇటీవల ప్రారంభించిన ఇ-ఆటో (L5M) Eblu Rozee అండ్ ఇ-సైకిల్ శ్రేణి Eblu Spin మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు షోరూమ్కి వచ్చి, ఉత్పత్తులను చూడవచ్చు. అంతేకాదు బుకింగ్ కూడా చేసుకోవచ్చు.

వినియోగదారులకు రుణ సౌకర్యాలను అందించడానికి గోదావరి ప్రముఖ బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రెండు ఉత్పత్తులకు సంబంధించిన డెలివరీలు ఫిబ్రవరినెలాఖరు నుంచి ప్రారంభమవుతాయి.