365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,జూన్ 2,2025 : తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, లక్ష్యాలకు అనుగుణంగా మనందరం కలిసి పని చేయాలి అని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సూచించారు. ఎన్నో కలలతో ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాం. ఆ కలలు సాకారం కావడానికి ప్రతి ఒక్కరు కంకణబద్ధులు కావాలని ఆయన కోరారు.
ఇది కూడా చదవండి…ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నాణ్యమైన విత్తనాల పంపిణీ ప్రారంభం
ఇది కూడా చదవండి…ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు
సోమవారం హైడ్రా కార్యాలయం ముందు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. ఔటర్ రింగ్ రోడ్డువరకూ పరిధిని నిర్దేశించి హైడ్రాను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

చెరువులు, నాలాలు, ప్రభుత్వ, ప్రజా ఆస్తులను పరిరక్షించడంతో పాటు ప్రకృతి వైపరీత్యాల కారణంగా ప్రాణాలు, ఆస్తి నష్టం జరగకుండా ప్రజలకు అండగా ఉండే విధంగా పని చేయాలని రాష్ట్ర ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది.
ఇది కూడా చదవండి…SSPL – దక్షిణభారతదేశపు అతిపెద్ద టెన్నిస్ బాల్ క్రికెట్ ఫెస్టివల్..
Read This also…SSPL Grand Launch: South India’s Biggest Tennis Ball Cricket League..
ఆ దిశగా అందరూ కలిసి పనిచేయాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గారు ఆకాంక్షించారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో అనేక మంది ప్రాణాలు అర్పించారని గుర్తు చేసి, రాష్ట్రం అన్ని రంగాల్లో సుభిక్షంగా ఉండాలని రాష్ట్ర గీతం చెప్పిన లక్ష్యాలను నెరవేర్చడానికి అందరూ కట్టుబడి కృషి చేయాలని ఆయన ఉద్ఘాటించారు.