365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, మే 23,2025: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలంలోని ఫిర్జాదిగూడ మున్సిపాలిటీ పరిధిలోని కంచ పర్వతాపూర్ గ్రామంలో అక్రమ కబ్జాల నుంచి రెండు ఎకరాల శ్మశానవాటికను కాపాడుకున్న నేపథ్యంలో శుక్రవారం గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
స్థానికులు టెంట్లు వేసి సహఫంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. టపాసులు పేల్చి ఉత్సాహంగా సంబరాలు నిర్వహించారు. హైడ్రా చర్యలపై కృతజ్ఞతగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ల చిత్రాలకు పాలాభిషేకం చేశారు.
ఇది కూడా చదవండి…జర్మన్ సంస్థ సెలెక్ట్ ఎనర్జీతో జునో జౌల్ భాగస్వామ్యం – గ్రీన్ హైడ్రోజన్ ఎగుమతులకు భారత లక్ష్యానికి బలమైన మద్దతు..
ఇది కూడా చదవండి…ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్లో కొత్త అధ్యాయం : హార్మొనీ డైరెక్ట్ 2.0ను విడుదల చేసిన ఎక్సికామ్
‘‘ఏళ్లుగా శ్మశానవాటికపై జరుగుతున్న ఆక్రమణలను అడ్డుకునేందుకు పోరాడుతున్నాం. ఎన్నోసార్లు ధర్నాలు చేశాం.

అధికారుల చుట్టూ తిరిగాం. చివరకు హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో 24 గంటల్లోనే సమస్యను పరిష్కరించారు. ఇది నిజమైన ప్రజాపాలనకు ఉదాహరణ’’ అని స్థానిక శ్మశానవాటిక పరిరక్షణ కమిటీ సభ్యులు తెలిపారు.
Read This also…Exicom Unveils Harmony Direct 2.0: A Game-Changer in EV Charging with India’s First Indigenous Charger OS
Read This also…Alembic Pharmaceuticals Receives USFDA Final Approval for Amlodipine and Atorvastatin Tablets..
గత బుధవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్వయంగా ప్రాంతాన్ని సందర్శించి శ్మశానవాటికపై అక్రమంగా నిర్మించిన కట్టడాలను గురువారమే తొలగించారు. ఈ వేగవంతమైన చర్యపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ హైడ్రా అధికారులకు అభినందనలు తెలిపారు.