365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఏప్రిల్ 13,2025: ప్రఖ్యాత మోటార్సైకిల్ బ్రాండ్ జావా యెజ్డి మోటర్సైకిల్స్ తమ అతిపెద్ద డీలర్షిప్ను నగరంలోని కొంపల్లిలో శనివారం ఘనంగా ప్రారంభించింది. ‘రివెక్స్పీరియన్స్ మోటో’ పేరుతో ఏర్పాటైన ఈ షోరూమ్లో జావా, యెజ్డి, బీఎస్ఎ బ్రాండ్ల మోటర్సైకిళ్ల పూర్తి శ్రేణి అందుబాటులో ఉంటుంది.
Read this also…SBI Chief Lauds RBI Rate Cut as Strategic Move for Economic Growth
అమ్మకాలు, ఆఫ్టర్ సేల్స్ సేవలతో పాటు ప్రీమియం కస్టమర్ అనుభవాన్ని ఈ కేంద్రం వినియోగదారులకు అందించనుంది.

ఇది హైదరాబాద్లో కంపెనీ ఏర్పాటు చేసిన 7వ డీలర్షిప్ కావడం విశేషం. మోటర్సైక్లింగ్ ప్రియుల అభిరుచి, వారి అంచనాలను గుర్తించి ఈ సదుపాయాన్ని ప్రారంభించినట్లు కంపెనీ పేర్కొంది.
Read this also…Mahindra Aerostructures to Manufacture Airbus H130 Helicopter Fuselage – A Major ‘Make in India’ Milestone
ఈ సందర్భంగా క్లాసిక్ లెజెండ్స్ సీఈబీఓ శరద్ అగర్వాల్ మాట్లాడుతూ… ‘‘హైదరాబాద్ మాకు ఎంతో కీలకమైన మార్కెట్. క్లాసిక్ మోటార్సైకిళ్ల పట్ల ఇక్కడి వాసుల ఆసక్తి ప్రత్యేకంగా ఉంటుంది. కొత్త డీలర్షిప్ ద్వారా జావా, యెజ్డి, బీఎస్ఎ మోటర్సైకిళ్లకు పెరుగుతున్న డిమాండ్ను తీర్చేందుకు మేం సిద్ధంగా ఉన్నాం,’’ అన్నారు.