365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మే 21,2025: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో గత పది సంవత్సరాలుగా గిరిజన ,దళిత వర్గాలకు చెందిన బోధనేతర సిబ్బంది పదోన్నతుల విషయంలో ఏర్పడిన అవకతవకల కారణంగా, ఇప్పటికే 2-4 సంవత్సరాలుగా ఉన్నత పదవుల్లో విధులు నిర్వహిస్తున్న పలువురు సిబ్బందిని అన్యాయంగా క్రింది స్థాయికి మార్చడం జరిగింది. దీని వలన వారు తీవ్ర మనోవేదనకు గురయ్యారు.

Read This also…OPPO Deepens Partnership with Google Gemini for Reno14 Series AI Integration

Read This also…Kothalavadi Teaser Out: Yash’s Mother Pushpa Arunkumar Turns Producer..

Read This also…BSH Launches India’s Largest-Capacity Top Freezer Refrigerator with Bosch XXL Series..

ఈ విభాగంలో జరిగిన అన్యాయాన్ని ప్రస్తుత వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ అల్దాస్ జానయ్య ,రిజిస్ట్రార్ డాక్టర్ జి.ఇ.సిహెచ్ విద్యాసాగర్ గమనించి, నిబంధనలకు అనుగుణంగా సరిదిద్దడం ద్వారా రివర్షన్‌కి గురైన గిరిజన,దళిత సిబ్బందికి న్యాయం కలిగించారు.

ఈ సందర్భంగా పి.జె.టి.ఎ.యు – SC & ST టీచింగ్, నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ బి. బాలాజీ నాయక్, యూనియన్ తరపున ఉపకులపతి డాక్టర్ అల్దాస్ జానయ్యకి,రిజిస్ట్రార్ డాక్టర్ జి.ఇ.సిహెచ్ విద్యాసాగర్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.