Tue. Apr 30th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,నవంబర్ 1,2023:తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు మర్కూక్‌ మండలం ఎర్రవెల్లిలోని తన ఫాంహౌస్‌లో నేటి నుంచి రాజ శ్యామలా యాగం నిర్వహించనున్నారు.

విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వామి స్వరూపానంద సరస్వతి పర్యవేక్షణలో మూడు రోజుల పాటు యాగం జరుగుతోంది.

యాగానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ, ఆంధ్రపదేశ్, కర్ణాటక రాష్ట్రాల పీఠాధిపతులు యాగంలో పాల్గొంటారు. ప్రజలు,రాష్ట్ర శ్రేయస్సు కోసం యాగం చేపట్టబడింది. చంద్రశేఖర్ రావు భార్య శోభ, ఇతర కుటుంబ సభ్యులు యాగంలో పాల్గొంటారు.