
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుపతి,ఆగస్టు 23.2021: కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో సోమవారం ఉదయం అష్టబంధన జీర్ణోద్ధరణ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. కోవిడ్ – 19 వ్యాప్తి నేపథ్యంలో ఈ కార్యక్రమాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహిస్తారు. ఆగస్టు 27న ఉదయం 7 గంటలకు మహా పూర్ణాహూతి, విమాన సంప్రోక్షణ, గోపుర సంప్రోక్షణతో ఈ కార్యక్రమం ముగుస్తుంది.
ఇందులో భాగంగా సోమవారం ఉదయం 8.30 నుంచి 10.30 గంటల వరకుయాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు అగ్ని ప్రతిష్ట, కుంభస్థాపన జరుగనుంది. అదేవిధంగా ఆగస్టు 24, 25, 26వ తేదీల్లో ఉదయం 8.30 నుంచి 10.30 గంటల వరకుయాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఆగస్టు 27న సాయంత్రం 4.30 నుంచి 6 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు కల్యాణోత్సవం, రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు ఆలయంలో ఊరేగింపు నిర్వహిస్తారు.