365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జూన్ 1,2025 : హైదరాబాద్లో జరిగిన ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ 2025 ఫినాలేలో థాయ్లాండ్ సుందరాంగన ఓపల్ సుచతా చువాంగ్స్రీ కేవలం అందచందాలతోనే కాకుండా, డిజిటల్ రంగంలోనూ తన ప్రతిభను చాటింది.
పోటీలో ఆమె మల్టీమీడియా విభాగంలో విజేతగా నిలవడమే కాకుండా, కాంటెస్టెంట్ యాప్ leaderboardలో అగ్రస్థానం దక్కించుకుంది. ఈ leaderboardలో ఆమె వీడియోలను 2.3 మిలియన్కి పైగా వీక్షణలు వచ్చాయి.
ఇది కూడా చదవండి…ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సీనియర్ అసిస్టెంట్ సీతాలక్ష్మి పదవీ విరమణ
ఇది కూడా చదవండి…వరద సమస్య పరిష్కారం కోసం హైడ్రా, జీహెచ్ఎంసీ సంయుక్త పరిశీలన..
సాంస్కృతిక, సామాజిక బాధ్యతలకు ప్రాధాన్యం ఇచ్చే ఈ పోటీలో అందమే కాకుండా, మేధస్సు, అవగాహన, సామాజిక ప్రభావం కీలకంగా నిలిచాయి. ఈ అద్భుతమైన సాయంత్రం అందాన్ని మాత్రమే కాకుండా, మహిళల సామర్థ్యాన్ని, సేవా మనోభావాన్ని ప్రతిబింబించింది.

ఈ వేడుకకు సహ-ఆతిథ్యం వహించినవారు 2016 మిస్ వరల్డ్ స్టెఫనీ డెల్ వల్లే , భారతీయ టెలివిజన్ వ్యాఖ్యాత సచిన్ కుమ్భార్.
ఫినాలే వేడుకలో బాలీవుడ్ తారలు జాక్వెలిన్ ఫెర్నాండేజ్ అండ్ ఇషాన్ ఖట్టర్ విభిన్నమైన ప్రదర్శనలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. భారతీయతకు చాటుగా, ఈ ప్రపంచస్థాయి ఈవెంట్కు అద్భుతమైన ఇండియన్ టచ్ ను ఇచ్చారు.

ఈ గ్రాండ్ ఫినాలే మహిళా సాధికారతకు, అందానికి, ఆత్మవిశ్వాసానికి, సాంస్కృతిక వైభవానికి అద్భుత వేదికగా నిలిచింది. తెలంగాణలో జరిగిన ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రం అంతర్జాతీయంగా మరింత గుర్తింపు సాధించింది.