365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,జూలై 26,2024: రామకృష్ణ మఠం స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా ఈ నెల 27న (శనివారం) “భారతదేశం విద్యా విజన్,విద్యావేత్తల పాత్ర”పై జాతీయ స్థాయి వర్క్షాప్ నిర్వహించనున్నారు.

సదస్సుకు వివిధ విద్యాసంస్థలకు చెందిన వెయ్యి మందికి పైగా ఉపాధ్యాయులు, పలువురు విద్యావేత్తలు హాజరుకానున్నారని హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద తెలిపారు.
చీఫ్ గెస్ట్ గా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తెలంగాణ డైరెక్టర్ డాక్టర్ బి.ఎస్. మూర్తి హాజరుకానున్నారు.

ప్రత్యేక ఉపన్యాసం స్వామి ముక్తిదానంద ఇవ్వనున్నారని స్వామి బోధమయానంద తెలిపారు. జూలై 28 (ఆదివారం) హాఫ్-డే స్పిరిచ్యువల్ రిట్రీట్ కార్యక్రమం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు జరగనుంది. స్వర్ణోత్సవ వేడుకల్లో విద్యార్థులు, భక్తులు పాల్గొని మూర్తి త్రయం కృప పొందాలని బోధమయానంద కోరారు.