365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల,9డిసెంబర్ 2022:తిరుమల శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడ సేవ గురువారం సాయంత్రం వైభవంగా జరిగింది.
సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామి తన ధార్మిక వైభవంతో రాత్రి 7 గంటల నుంచి 9 గంటల మధ్య శక్తివంతమైన గరుడ వాహనంపై నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు.
గరుడ వాహనం – సర్వపాప ప్రాయశ్చిత్తం

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు.
అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజేస్తున్నారు