365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి, మే 10,2024: తిరుపతిలో మే 12వ తేదీన శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో పుష్పయాగం నిర్వహించనున్నారు. మే 11వ తేదీన సాయంత్రం పుష్పయాగానికి అంకురార్పణ జరుగనుంది.
![](http://365telugu.com/wp-content/uploads/2024/05/PUSHPA-YAGAM-IN-KRT.jpg)
మే 12న ఉదయం 10 నుంచి 11 గంటల వరకు స్వామి, అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారికి పలు రకాల పుష్పాలతో అభిషేకం చేస్తారు.
అనంతరం రాత్రి 7 గంటలకు శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహిస్తారు.
గృహస్తులు(ఇద్దరు) రూ.1,000/- చెల్లించి టికెట్ కొనుగోలుచేసి పుష్పయాగంలో పాల్గొనవచ్చు.
![](http://365telugu.com/wp-content/uploads/2024/05/PUSHPA-YAGAM-IN-KRT.jpg)
శ్రీ కోదండరామాలయంలో ఏప్రిల్ 5 నుంచి13వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం విదితమే. ఈ బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు.
Also read: JIO INTRODUCES THE ULTIMATE OTT STREAMING PLAN @ ₹ 888/ MONTH..
Also read: Mega Star Chiranjeevi on Padma Vibhushan and Campaigning for Pawan Kalyan
Also read: MG celebrates its centenary year; launches ‘100-Year Limited Edition’ in India.
Also read: MSDE sign MOU for flagship Drone Didi Yojana; skilling women to become drone pilots
Also read: Bank of India Signs MOU with Indian Coast Guard for BOI Rakshak Package
ఇది కూడా చదవండి: మేధావి మౌనం వీడు :ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు డా.హిప్నో పద్మా కమలాకర్
Also read: Akshay Tritiya Parna Mahotsav held
ఇది కూడా చదవండి: ఎంఎస్ ధోనీతో టార్గెట్ 630 కోసం ప్రచార కార్యక్రమాన్ని ఆవిష్కరించిన స్వరాజ్
Also read:Swaraj Unveils new campaign for Target 630 featuring MS Dhoni
Also read: Surpassed ₹ 180 Bn in Revenues Highest Ever Yearly & Quarterly Revenue & Profitability
ఇది కూడా చదవండి: పింఛన్లు, ఇన్పుట్ సబ్సిడీ వంటి సంక్షేమ పథకాలకు డీబీటీ ఆర్థిక సహాయాన్ని నిలిపివేయాలని బాబు కంప్లైంట్..