Sat. Jul 27th, 2024

365తెలుగు.కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్,నవంబర్23,2021:రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను హైదరాబాద్ లోని తన క్యాంప్ కార్యాలయంలో శ్రీలంక కళాకారిణిలుకలిశారు. సింగిడి సాంస్కృతిక సంస్థ, తెలంగాణా పర్యాటక, భాషా, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సౌజన్యంతో రవీంద్రభారతి నిర్వహిస్తున్న జాతీయ,అంతర్జాతీయ సాంస్కృతిక ప్రదర్శనలో పాల్గొనేందుకు వచ్చిన శ్రీలంక సాంస్కృతిక శాఖ కు చెందిన కళాకారిణిలు మర్యాద పూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ కళాకారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో సింగిడి సాంస్కృతిక శాఖ డైరెక్టర్ విశ్వకర్మ తదితరులు పాల్గొన్నారు.