Mon. Jul 8th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, జూన్ 6,2024 : తెలంగాణ రాష్ట్రం నాణ్యమైన పట్టు వస్త్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిందని సుధాజైన్ అన్నారు. గురువారం హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుధాజైన్ మాట్లాడుతూ..

చేనేత కళా కారుల ఉత్పత్తులను దేశ, విదేశాలకు పంపి చేనేత కళాకారుల ప్రతిభను చాటిచెప్పడం తమ లక్ష్యమని, చేనేత వస్త్రాలను కోనేలాగా వారు చేనేత ఉత్పత్తులను ధరించేలా చేయడమే తమ కోహినూర్ స్టోరీ ఉద్దేశమని అన్నారు.

చేనేత ఉత్పత్తులను తయారు చేసే వారిని ప్రోత్సహిస్తూ తమవంతుగా చేయూతనివ్వడమే తమ ధ్యేయమని, చేనేత కళాకారుల ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసేందుకు తాము దోహద పడతామని పాండు చెప్పారు. విభిన్నమైన, అరుదైన చేనేత ఉత్పత్తులను వినియోగ దారులకు అందించడంతోపాటు వాటి పట్ల ఆదరణ పెంచడమే తమ ఉద్దేశ్యం అని ఆయన తెలిపారు.

దేశవ్యాప్తంగా ఉన్నచేనేతనేత కార్మికులను గౌరవించడం, ప్రోత్సహించడంమే ఈ కోహినూర్ ఉద్దేశ్యం అని తెలిపారు. మార్కెట్ లో లభించే నకిలీ పట్టు వస్త్రాలను ఎలా తెలుసుకోవాలో,నాణ్యమైన చేనేత వస్త్రాలను ఎలా గుర్తించాలో కూడా ప్రజలకు తెలియజేస్తామని చెప్పారు.

కొంత మంది సింథటిక్ ను సిల్క్ గా
అమ్ముతున్నారు. దీనిపై అవగా వాహన కల్పించడానికి తమ సంస్థ కృషి చేస్తోందని అన్నారు. చేనేత కళాకారుల డిజైన్లకు ఒక రూపు తెచ్చి వారు
రూపొందించిన డిజైన్లను ఇతరులు కాపీ చేయకుండా ఒక అల్బమ్ ను ఈ సందర్భంగా విడుదల చేశామని సుధజైన్ వెల్లడించారు.

చేనేతకు చేయూతనివ్వాలని నంది అవార్డు గ్రహీత, టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షులు, హైదరాబాద్ సమయ్ హిందీ డైలీ న్యూస్ పేపర్ ఎడిటర్ మహమ్మద్ షరీఫ్ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

వారంలో ఒక రోజు తప్పనిసరిగా చేనేత వస్త్రాలు ధరించి, చేనేతకు చేయూతనివ్వాలని ప్రజల అవసరాలకు అనుగుణంగా చేనేత డిజైన్లను రూపొందిచాలని, నైపుణ్యం కలిగిన చేనేతకారులను ప్రోత్సహించాలని షరీఫ్ చెప్పారు.

నాణ్యమైన చేనేత వస్త్రాలను తక్కువ ధరలకే అందిస్తూ చేనేతకళాకారులను ప్రోత్సాహి స్తున్నట్లు నిర్మాత దర్శకుడు రమేష్ రాజ చెప్పారు.