365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జూలై 9,2024:నాలుగేళ్ల క్రితం ప్రవేశపెట్టిన కేబుల్ టీవీ, డీటీహెచ్ టారిఫ్ క్యాప్ కంట్రోల్ (నెట్వర్క్ కెపాసిటీ సీలింగ్)ను తొలగించారు. ఇక నుంచి కంపెనీలు మార్కెట్ పరిస్థితుల ఆధారంగా ఛానెల్ ప్యాకేజీలకు రేట్లను నిర్ణయించుకోవచ్చు. దీంతో వినియోగదారులు టీవీ ఛానళ్లను చూసేందుకు ఎక్కువ ధర చెల్లించాల్సి ఉంటుంది.

ప్రస్తుతం రూ.130కి పన్ను లేకుండా 200 ఛానెల్లు అందించడం తొలగించారు. పన్నుతో సహా రూ. 153కి 200 ఛానెల్లను ప్రజలు పొందుతున్నారు. ఒకవేళ 200 కంటే ఎక్కువ టీవీ ఛానెల్లు అవసరమైతే, రూ.160 చెల్లించాలి. అన్ని ఫ్రీ-టు-ఎయిర్ ఛానెల్లకు, వినియోగదారులు నెలకు చెల్లించాల్సిన గరిష్ట మొత్తం రూ.160గా నిర్ణయించారు.
కొత్త విధానం 90 రోజుల్లో అమల్లోకి రానుంది. దీంతో కంపెనీలు, సర్వీస్ ప్రొవైడర్లు తమకు నచ్చిన రేట్లను పెంచుకోవచ్చు. రేట్లు ఎంత పెంచాయో కంపెనీలు వాటిని మాత్రమే ప్రచురించాలని నోటిఫికేషన్లో పేర్కొంది.

కొత్త టారిఫ్ రేట్లు వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉంటాయని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) పేర్కొంది. పరిమితిని తొలగించడం వల్ల మార్కెట్లో పోటీతత్వం ఏర్పడుతుందని కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది.
ఇదికూడా చదవండి: రష్యన్ సైన్యంలో భాగమైన భారతీయుల ను స్వదేశానికి రప్పించడానికి ఒప్పందం
Also read :What kind of diet should be followed in order to strengthen teeth..?