
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా,డిసెంబర్ 29,2021: దేశంలో 15-18 మధ్య వయసు గల వారికి, వ్యాధి సోకే అవకాశం ఉన్నవారికి, ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్ లైన్ సిబ్బందికి ముందు జాగ్రత్తగా మూడవ డోస్ వేసేందుకు అమలు చేయాల్సిన వ్యూహంపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ సమీక్షించి చర్చించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన విధంగా దేశంలో 15-18 మధ్య వయసు గల వారికి 2022 జనవరి 3 నుంచి టీకా కార్యక్రమం వేసే కార్యక్రమం ప్రారంభం అవుతుంది. వ్యాధి సోకే అవకాశం ఉన్నవారికి జనవరి 10 నుంచి మూడో డోస్ టీకాలు వేసే కార్యక్రమం ప్రారంభం అవుతుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసింది.

దేశంలో 15-18 మధ్య వయసు గల వారికి ‘ కోవాగ్జిన్ ‘ టీకా మాత్రమే వేస్తారని రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి వివరించారు. ఈ తరగతి ప్రజలకు ఇచ్చేందుకు అవసరమైన కోవాగ్జిన్ డోసులను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సరఫరా చేస్తామని అన్నారు. కొద్దిరోజుల్లో కోవాగ్జిన్ సరఫరా ప్రణాళికను రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు పంపుతామని ఆయన చెప్పారు. టీకా పొందే అర్హత ఉన్నవారు కో-విన్లో 2022 జనవరి 1 నుంచి తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. కార్యక్రమం ప్రారంభం అయ్యే 2022 జనవరి 3న వారు టీకా కేంద్రాలకు వెళ్లి పేర్లను నమోదు చేసుకోవచ్చు. 2007 లేదా అంతకుముందు జన్మించిన వారు ఈ తరగతిలో టీకా పొందేందుకు అర్హత కలిగి ఉంటారు.
టీకా కార్యక్రమంలో అనుసరిస్తున్న విధానాలు, నిబంధనలు 15-18 మధ్య వయసు గల వారికి వర్తిస్తాయి. టీకా తీసుకున్న తరువాత వారు 30 నిమిషాల పాటు టీకా కేంద్రంలో ఉండవలసి ఉంటుంది. ఏఈఎఫ్ఐ కోసం వారిని పర్యవేక్షణలో ఉంచుతారు. 28 రోజుల తరువాత రెండవ డోస్ వీరు రెండవ డోస్ తీసుకోవచ్చు. 15-18 మధ్య వయసు గల వారి కోసం కొన్ని కోవిడ్ టీకా కేంద్రాలను ప్రత్యేకంగా కేటాయించాలని రాష్ట్రాలకు ఆరోగ్య శాఖ కార్యదర్శి సూచించారు. కో-విన్ లో ఈ వివరాలను పొందుపరచాలని అన్నారు. టీకాలు వేసే సమయంలో గందరగోళాన్ని నివారించడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు.

15-18 మధ్య వయసు గల వారికి టీకాలు వేసేందుకు గుర్తించిన కేంద్రాల్లో క్యూ లైన్ లను ఏర్పాటు చేయాలని, టీకా వేసేందుకు విడిగా బృందాలను ఏర్పాటు చేయాలని రాష్ట్రాలకు ఆయన సూచించారు. సరైన వ్యాక్సిన్ ఇచ్చేలా చూసేందుకు టీకా కేంద్రంలో 15-18 మధ్య వయసు గల వారికి ఒక క్యూ, మిగిలినవారికి మరొక క్యూ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.
రెండవ డోసు తీసుకున్న తొమ్మిది నెలలు ( 39 వారాలు) తర్వాత మాత్రమే ముందు జాగ్రత్త డోస్ తీసుకోవడానికి లబ్ధిదారు అర్హత పొందుతారు. డాక్టర్ సర్టిఫికెట్ కలిగిన వారికి మాత్రమే టీకా కేంద్రాల్లో ముందు జాగ్రత్త డోస్ ఇస్తారని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి అన్నారు. ముందు జాగ్రత్త డోస్ పొందేందుకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్లు/సర్టిఫికేట్ అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ముందు జాగ్రత డోస్ తీసుకునే అర్హత కలిగిన వారికి కో-విన్ సందేశాలు పంపుతుందని, డిజిటల్ వాక్సినేషన్ సర్టిఫికెట్ లో దీనిని పొందుపరచడం జరుగుతుందని ఆయన వివరించారు.
15-18 మధ్య వయసు గల వారికి టీకాలు వేసేందుకు టీకా బృందాలు/ టీకాలు వేసే వారికి పునశ్చరణ కార్యక్రమాలను నిర్వహించేందుంకు, వారి కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సూచనలు జారీ అయ్యాయి. గుర్తించిన కేంద్రాలకు ముందుగానే కోవాగ్జిన్ టీకాలను సరఫరా చేసినందుకు ముందస్తు ప్రణాళిక రూపొందించాలని రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలకు సూచనలు జారీ అయ్యాయి.

టీకా సమయంలో వ్యాక్సిన్ కలిసి పోకుండా చూసేందుకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ప్రత్యేక సమయాన్ని కేటాయించాలని, విడిగా క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని ( పెద్దలకు కూడా టీకాలు వేస్తున్న కేంద్రాలు అయితే), టీకా చేసేందుకు ప్రత్యేక బృందం ( ఒకే సమయంలో టీకా వేసే కేంద్రాల వద్ద) ఏర్పాటు చేయాలని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి సూచనలు జారీ చేశారు. కో-విన్ ద్వారా జిల్లాల వారీగా లభ్డిదారులను గుర్తించి తమకు అవసరమైన టీకాల సంఖ్యను పంపాలని కూడా ఆయన రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలను కోరారు.
15-18 మధ్య వయసు గల వారికి టీకాలు వేసేందుకు కార్యక్రమం అమలు జరుగుతుందని ప్రచారం చేయాలని ఆయన అన్నారు. లబ్ధిదారులకు టీకాలు వేసేందుకు అవసరమైన మొత్తంలో డోసులను పంపుతామని ఆయన చెప్పారు. సమావేశంలో అదనపు కార్యదర్శి (ఆరోగ్యం) డాక్టర్ మనోహర్ అగ్నానీ, సంయుక్త కార్యదర్శి (ఆరోగ్యం) శ్రీ విశాల్ చౌహాన్ , ప్రిన్సిపల్ సెక్రటరీ (ఆరోగ్యం), అడిషనల్ చీఫ్ సెక్రటరీ (ఆరోగ్యం), సంబంధిత రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల రాష్ట్ర పర్యవేక్షణ అధికారులు పాల్గొన్నారు.