365తెలుగుడాట్ కామ్ ఆన్లైన్ న్యూస్,హైదరాబాద్,నవంబర్ 16,2022: టాలీవుడ్ లెజెండరీ నటులు సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణంరాజు, కృష్ణలు తెలుగు చిత్ర పరిశ్రమలో తమదైన శైలితో ప్రేక్షకుల హృదయాల్లో గూడు కట్టుకున్నారు. తమ అద్భుతమైన నటనాచాతుర్యంతో సినీ ప్రపంచంలో స్వర్ణయుగానికి ఆద్యులయ్యారు.
సీనియర్ ఎన్టీఆర్ గుండమ్మ కథ,దాన వీర శూర కర్ణలో వినోద భరితమైన, పౌరాణిక పాత్రలకు పేరుగాంచినట్లయితే, ఏఎన్ ఆర్ తన దేవదాస్ సినిమా ,కృష్ణం రాజు విషయానికి వస్తే, అతని రంగూన్ రౌడీని, ప్రధాన నటుడిగా అతని డామినేటింగ్ డైలాగ్లను ఎలా మర్చిపోగలరు? చివరగా, సూపర్ స్టార్ కృష్ణ,వెండితెరపై చేసిన అద్భుతాలను మనం ప్రస్తావించాలి.
అటువంటి సినిమాల్లో అల్లూరి సీతా రామరాజు పాత్ర అయినా, గూడాచారి116 జేమ్స్ బాండ్ క్యారెక్టర్ సినీ ప్రపంచంలో ఆయన చెరగని ముద్రవేశారు. అయితే ఇప్పుడు నలుగురు నటీనటులు కన్నుమూయడంతో స్వర్ణ దశ ముగిసినట్లే. ముఖ్యంగా కృష్ణం రాజు,కృష్ణ ఇటీవలే తుది శ్వాస విడిచారు.
టాలీవుడ్ దిగ్గజ నటుల గురించి క్లుప్తంగా..

సీనియర్ ఎన్టీఆర్:
ఈ విలక్షణ నటుడు1923 మే 28న జన్మించి1996 జనవరి18న కన్నుమూశారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు చిత్ర పరిశ్రమకు సేవలందించిన ఆయన 300కుపైగా సినిమాల్లో నటించారు. 1949లో “మన దేశం” సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఆయన ఆ మరుసటి సంవత్సరంలోనే 3 సినిమాలుచేశారు. అగ్గి రాముడు, భూకైలాస్, గుండమ్మ కథ మొదలైనవి వెండితెరపై తన సత్తాను నిరూపించుకున్నారు ఎన్టీఆర్.
1964 లో ఆయన పూర్తిగా16 సినిమాల్లో నటించి తన కెరీర్లో అద్భుతమైన విజయాలను సాధించారు. 1980సంవత్సరంలో రాజకీయ జీవితంలోకి అడుగుపెట్టాడు.1983లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు. ఆయన చివరిసారిగా 1993లో బాపు దర్శకత్వం వహించిన శ్రీనాథ కవి సార్వభౌముడు చిత్రంలో కనిపించాడు. 1996లో ఆయన హఠాన్మరణం చెందారు.
అక్కినేని నాగేశ్వరరావు:

తెలుగు చిత్ర పరిశ్రమకు మరో పిల్లర్ ఏ ఎన్ ఆర్. ఈయన నటన తీయోటర్లలో ప్రేక్షకులను తమ సీట్లకు అతుక్కుపోయేలా చేసేది. దాదాపు డెబ్భై ఏళ్లపాటు సినీ పరిశ్రమకు సేవలందించిన ఆయన అనేక ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. 1944లో “శ్రీ సీతా రామ జననం” చిత్రంతో తన కెరీర్ని ప్రారంభించాడు.1953లో విడుదలైన “దేవదాసు” సినిమాతో సంచలనం సృష్టించాడు.
అంతేకాదు దొంగ రాముడు, మాయాబజార్, భూకైలాస్ ,మరెన్నో సినిమాలు ఆయన్ని భారతీయ ఉత్తమ నటులలో ఒకరిగా మార్చాయి. చిత్ర పరిశ్రమలో తన కొడుకు నాగార్జున, మనవళ్లు సుమంత్, అఖిల్, నాగ చైతన్యతో కూడా నటించాడు. నాగార్జున, అఖిల్ ,చైతన్య సినిమా అభిమానులందరినీ మెస్మరైజ్ చేసిన వారి కుటుంబ చిత్రం “మనం”లో ఆయన చివరిసారిగా కనిపించాడు. 2013 నుంచి క్యాన్సర్తో బాధపడుతున్నాడు. మేజర్ లాపరోస్కోపిక్ శస్త్రచికిత్స తర్వాత “మనం” సినిమాలో నటించారు. ఆయన 2014లో 90 ఏళ్ల వయసులో మరణించాడు.

కృష్ణం రాజు:
తెలుగు చిత్ర పరిశ్రమలో రెబల్ స్టార్ కృష్ణంరాజుకు ప్రత్యేక స్థానం ఉంటుంది. రెబల్ స్టార్ గెటప్, డైలాగ్ డెలివరీ, అద్భుతమైన నటనతో వెండితెరపై ప్రత్యేకమైన శైలిని సొంతం చేసుకున్నారు. 1966లో ‘చిలకా గోరింక” చిత్రంతో కెరీర్ ప్రారంభించిన ఆయన 190కి పైగా సినిమాల్లో నటించారు. ఉత్తమ సినిమాలు “కటకటాల రుద్రయ్య”, “రంగూన్ రౌడీ”, “అమర దీపం”, “జీవన తరంగాలు”. ఆయన చివరిసారిగా ప్రభాస్ తోకలిసి రాధే శ్యామ్లో నటించాడు. గురు పరమహంసగా కనిపించాడు. సెప్టెంబర్ 11తేదీన, 2022న కన్నుమూశారు కృష్ణంరాజు.
సూపర్ స్టార్ కృష్ణ:

కృష్ణ మరణంతో తెలుగు చలన చిత్రపరిశ్రమ గోల్డెన్ ఎరాకు తెరపడింది. సిల్వర్ స్క్రీన్లపై ఆయన కనిపించారంటే చాలు సినీ ప్రేమికులందరికీ వేడుకే. ఆయనకు “నట శేఖర” అని, “సూపర్ స్టార్” బిరుదులున్నాయి. 1943 మే 31న బుర్రిపాలెంలో జన్మించిన ఆయన సినిమాలపై ఆసక్తితో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి చెన్నైవెళ్ళారు. అతని మొదటి చిత్రం “తేనే మనసులు” మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఆయన నటించిన మూడవ చిత్రం “గూడాచారి 116″తో స్టార్ హోదాను సొంతం చేసుకున్నాడు.
ఒకానొక సమయంలో ఒకేసారి 20 సినిమాలకు సంతకం చేశాడు. అల్లూరి సీతా రామరాజు వేషధారణ అయినా, మోసగాళ్లకు మోసగాడు సినిమాలో జేమ్స్ బాండ్ , కౌబాయ్ పాత్ర ల్లో తనదైనముద్ర వేశారు కృష్ణ. విజయ నిర్మలతో కలిసి 40కి పైగా సినిమాల్లో నటించి నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా కూడా తనేంటో నిరూపించుకున్నాడు. కృష్ణ చివరిసారిగా 2016లో “శ్రీశ్రీ” చిత్రంలో కనిపించాడు. వయస్సు సంబంధిత సమస్యల కారణంగా అప్పటి నుంచి నటనకు దూరంగా ఉన్నాడు. నవంబర్ 15వతేదీన మరణించారు.