TTD-BOARD-MEMBER-TAKES-OATHTTD-BOARD-MEMBER-TAKES-OATH

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుపతి,సెప్టెంబర్19, 2021: టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి సభ్యుడిగా శ్రీ టంగుటూరి మారుతిప్రసాద్ తిరుమల శ్రీ‌వారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆల‌యంలోని బంగారు వాకిలి వ‌ద్ద టిటిడి అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు.

TTD-BOARD-MEMBER-TAKES-OATH
TTD-BOARD-MEMBER-TAKES-OATH

శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో మారుతిప్రసాద్ కు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, కాఫీ టేబుల్ బుక్‌ను అద‌న‌పు ఈఓ అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో రమేష్ బాబు, డెప్యూటీ ఈవో సుధారాణి, పేష్కార్ శ్రీ‌హ‌రి ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.