Thu. May 2nd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,మార్చి 31,2024: వైద్య శాస్త్రంలో పురోగతి కారణంగా, వివిధ రకాల శస్త్రచికిత్సలు నేడు వైద్యులకు నిత్యకృత్యంగా మారాయి. ప్లాస్టిక్ సర్జరీ అనేది భారతదేశంలో మాత్రమే ప్రారంభమైందని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. అవును, ఇది మొదటిసారిగా మన దేశానికి చెందిన ఓ వ్యక్తి చేశాడు, దీని ఆధారంగా ప్రస్తుతం ప్రపంచ దేశాలు సైతం ఈ శస్త్రచికిత్స ప్రక్రియ గురించి నేర్చుకున్నాయి. మొదటి ప్లాస్టిక్ సర్జరీ పితామహుడు..మహర్షి సుశ్రుతుడు. ఆయన గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రపంచంలోనే మొట్టమొదటి ప్లాస్టిక్ సర్జరీ చేసిందెవరు..?

ఏ)శివుడు, బీ)విశ్వామిత్రుడు, సీ)బ్రహ్మ, డీ)సుశృతుడు

ఆన్సర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్లాస్టిక్ సర్జరీ ఎలా ప్రారంభమైంది..?

మహర్షి సుశ్రుతుడు ప్రపంచానికి ఒక పుస్తకాన్ని అందించాడు. అందులో చాలా కష్టతరమైన ఆపరేషన్ల అన్ని పద్ధతులు ఉన్నాయి. ఆయన రచించిన సుశ్రుత సంహిత, నేటికీ శాస్త్రవేత్తలకు పరిశోధనలో ముఖ్యమైన అంశంగా మిగిలిపోయింది. దాదాపు 3 వేల సంవత్సరాల క్రితం, ప్రపంచంలోనే మొట్టమొదటి ప్లాస్టిక్ సర్జరీ భారతదేశంలోని కాశీలో జరిగింది.

మహర్షి సుశ్రుత, శస్త్రచికిత్స పితామహుడు, ప్రాచీన భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ శస్త్రవైద్యుడు. ఆయన రాసిన సుశ్రుత సంహితలో ముక్కు ప్లాస్టిక్ సర్జరీ ప్రస్తావన ఉంది. దీని వెనుక ఉన్న కారణం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దీని గురించి తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ప్లాస్టిక్ సర్జరీ ఎలా ప్రారంభమైంది..? పురాతన భారతదేశంలో ఎలా నిర్వహించారనేది తెలుసుకుందాం..

ప్లాస్టిక్ సర్జరీ భారతదేశంలో ప్రారంభమైంది. ప్లాస్టిక్ సర్జరీ అనేది విదేశాల నుంచి వచ్చింది కాదు. సుమారు 3 వేల సంవత్సరాల క్రితం, ప్రాచీన భారతీయ వైద్యుడు సుశ్రుతుడు మొదటిసారిగా ముక్కుకి శస్త్రచికిత్స చేశాడు. దానికి సంబంధించిన ప్రక్రియను కూడా తన పుస్తకంలో స్కిన్ గ్రాఫ్టింగ్ అంటే ఏమిటి, ఎలా చేస్తారు..? అనే ప్రక్రియను వివరించాడు.

ఆ కారణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

పురాతన భారతదేశంలో తీవ్రమైన నేరాలకు ముక్కు ,చెవులు కత్తిరించేవారు. శిక్షఈ నిబంధన కారణంగా, నేరస్థులు వైద్య శాస్త్రం సహాయంతో ఈ అవయవాలను తిరిగి తీసుకురావడానికి ప్రయత్నించేవాళ్లు. అటువంటి పరిస్థితిలో, మహర్షి సుశ్రుత ప్లాస్టిక్ సర్జరీ అవసరమని భావించాడు. అతను మొదటిసారిగా ముక్కు పునర్నిర్మాణ శస్త్రచికిత్సను విజయవంతంగా ప్రారంభించాడు.

సుశ్రుత సంహితలో 300 రకాల శస్త్ర చికిత్సల ప్రస్తావన ఉంది. సుశ్రుత సంహితలో దాదాపు 300 రకాల శస్త్ర చికిత్సల గురించిన సమాచారం ఉంది. ఇది మూత్రాశయంలోని రాళ్లను తొలగించడం, కంటిశుక్లం, హెర్నియా, శస్త్రచికిత్స ద్వారా డెలివరీ చేయడం కూడా సుశ్రుత సంహితలో ప్రస్తావించారు.

శస్త్రచికిత్స తర్వాత సంక్రమణను నివారించడానికి మార్గాలు..

ప్రాచీన భారతదేశంలో సుశ్రుతుడు ముక్కు శస్త్రచికిత్స సమయంలో ఒక వ్యక్తి చెంప లేదా నుదిటి చర్మాన్ని తీసుకొని శస్త్రచికిత్స సమయంలో ఉపయోగించాడని సుశ్రుత సంహితలో పేర్కొన్నారు. అంతే కాదు, శస్త్రచికిత్స తర్వాత కూడా, సుశ్రుతుడు అనేక రకాలైన ఇన్ఫెక్షన్లను నివారించడానికి వివిధ రకాల మందులను కూడా అందించేవాడట. వాటిని దూది సహాయంతో శరీర భాగంలో చుట్టడం ద్వారా కప్పబడి ఉంటుంది.

సుశ్రుత సంహిత పాశ్చాత్య దేశాలకు చేరుకుంది.8వ శతాబ్దంలో సుశ్రుత సంహిత అరబిక్ భాషలోకి అనువదించిన తర్వాత, అది పాశ్చాత్య దేశాలకు కూ చేరింది. ఇది మాత్రమే కాదు, మీడియా నివేదికల ప్రకారం..1793లో వారు భారతదేశంలో ఉన్న సమయంలో ఇద్దరు ఆంగ్ల సర్జన్లు కూడా వారి సొంత కళ్ళతో ముక్కు శస్త్రచికిత్సను చూశారు. దీని ప్రస్తావన లండన్ జెంటిల్‌మన్ మ్యాగజైన్‌లో కూడా చూడవచ్చు. సమాచారం ప్రకారం, ఈ ప్రక్రియను తెలుసుకుని, దాని గురించి అర్థం చేసుకున్న తరువాత, బ్రిటీష్ సర్జన్ జోసెఫ్ కాన్స్టాంటిన్ మృతదేహాలతో సుమారు 20 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసాడు. దీని తర్వాత అతను 1814 లో చేసిన ఆపరేషన్ విజయవంతమైంది.

కుట్లు వేయడానికి చీమలు..

సుశ్రుత సంహితలో 1100 వ్యాధులు ప్రస్తావించారు. శస్త్ర చికిత్సకు సంబంధించిన పదకొండు వందల వ్యాధులు కూడా సుశ్రుత సంహితలో పేర్కొన్నారు. అంతేకాదు వాటి చికిత్స కోసం 650 రకాల మందులను గురించి కూడా ఇందులో వివరించారు. గాయం తర్వాత రక్త ప్రవాహాన్ని ఆపివేయడం లేదా విరిగిన ఎముకలకు కట్టుకట్టడం వంటివాటిని గురించి వెల్లడించారు. పురాతన భారతదేశంలో కత్తిరించిన భాగాలను కుట్టడానికి కుట్లు వేయడానికి బదులుగా చీమలను ఉపయోగించడం గురించి ప్రస్తావన ఉంది, వాటి దవడలు గాయాన్ని క్లిప్ చేయడానికి ఉపయోగించారాట.

ఇది కూడా చదవండి: ఇండియన్ బెస్ట్ స్ట్రీట్ ఫుడ్స్..

ఇది కూడా చదవండి: ప్రేమించండి.. క్షమించండి : డా.హిప్నోపద్మాకమలాకర్,జి.కృష్ణవేణి

ఇది కూడా చదవండి: రైల్వేలో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్.. వివరాలు ఇవిగో..