365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, మార్చి 15,2025: ప్రతివారం ప్రత్యేక చిత్రాలు, ప్రత్యేక కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరించే జీ తెలుగు ఈ ఆదివారం (మార్చి 16) అదిరిపోయే వినోదాన్ని అందించేందుకు సిద్ధమైంది. తెలుగువారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మల్టీస్టారర్ హిట్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఉదయం 9 గంటలకు ప్రీమియర్గా ప్రసారం కానుండగా, అనంతరం హోలీ ప్రత్యేక కార్యక్రమం అక్కడ అమ్మాయిలు – ఇక్కడ అబ్బాయిలు మధ్యాహ్నం 12:30 గంటలకు అలరించనుంది. ఇక మధ్యాహ్నం 3 గంటలకు డియర్ బ్రదర్ చిత్రాన్ని టెలివిజన్ ప్రీమియర్గా ప్రసారం చేయనుంది.
Read this also…Zee Telugu’s Triple Entertainment Treat This Weekend – Don’t Miss It!
ఇది కూడా చదవండిమణికొండలో నాలా ఆక్రమణల తొలగింపు
ఇది కూడా చదవండి…చార్మినార్ పరిసరాల్లో ఈద్ షాపింగ్ సందడి.. రాత్రి వేళల్లో కోలాహలం
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మరోసారి
2013లో విడుదలై మెగా బ్లాక్బస్టర్గా నిలిచిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విక్టరీ వెంకటేష్, సూపర్స్టార్ మహేశ్బాబు కలిసి నటించిన ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించారు. మిక్కీ జే మేయర్ అందించిన స్వరాలు ఇప్పటికీ శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సమంత, అంజలి, ప్రకాష్ రాజ్, జయసుధ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా, ఇటీవల మార్చి 8న రీరిలీజ్ అయి మంచి స్పందన పొందింది. ఆదివారం ఉదయం 9 గంటలకు ఈ సినిమాను జీ తెలుగులో వీక్షించనున్నారు.

హోలీ స్పెషల్: అక్కడ అమ్మాయిలు – ఇక్కడ అబ్బాయిలు
హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని జీ తెలుగు గ్రాండ్ ఈవెంట్ అక్కడ అమ్మాయిలు – ఇక్కడ అబ్బాయిలును మార్చి 9న నరసరావుపేటలోని ఎస్ఎస్ఎన్ కాలేజ్ క్రికెట్ గ్రౌండ్లో నిర్వహించింది. యాంకర్ రవి ఎనర్జిటిక్ హోస్టింగ్తో హోలీ వేడుకలు మరింత ఉత్సాహంగా సాగాయి. దీప్తి మన్నె, దర్శ చంద్రప్ప, ప్రీతి శర్మ, పృథ్వీ వంటి ప్రముఖ టీవీ నటీనటుల సమక్షంలో ఈ కార్యక్రమం ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. అలాగే MAD2 సినిమా హీరోలు నార్నే నితిన్, సంగీత శోభన్, రామ్ నితిన్, అక్కడ అమ్మాయి – ఇక్కడ అబ్బాయి సినిమా నటీనటులు ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి, కమెడియన్ సద్దాం, సింగర్ యశస్వి ఈ వేడుకలో సందడి చేశారు.
Read this also…Hyderabad’s Charminar Bustles with Late-Night Eid Shopping Frenzy
ఇది కూడా చదవండి…రైతులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన తమిళనాడు ప్రభుత్వం
డియర్ బ్రదర్ టెలివిజన్ ప్రీమియర్
ఈ ఆదివారం టీవీ ప్రీమియర్లో భాగంగా డియర్ బ్రదర్ ప్రసారం కానుంది. జయం రవి, ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా నటించిన ఈ చిత్రంలో భూమిక చావ్లా, రావు రమేష్, నటరాజన్ సుబ్రమణ్యం, విటివి గణేష్ ముఖ్య పాత్రలు పోషించారు. ఎం. రాజేష్ దర్శకత్వంలో స్క్రీన్ సీన్ మీడియా ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ సినిమాకు హారిస్ జయరాజ్ స్వరాలు అందించారు. కుటుంబ కథా చిత్రంగా రూపొందిన ఈ సినిమా ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది.